మహిళలపై జరిగే నేరాలకు సైబర్ ల్యాబ్ తో చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్ను ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధన కేంద్రం (సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్) ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై డి.జి.పి మహేందర్ రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు.
డి.ఐ.జి బి.సుమతి, సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ….రాష్ట్ర జనాభాలో 50శాతం ఉన్న మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, దీనిలో భాగంగానే మహిళలు, పిల్లలు సైబర్ నేరాలకు గురికాకుండా ఉండేందుకు సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే సమాజంలోని భిన్న వర్గాల భాగస్వామ్యంతో మహిళా భద్రత విభాగం ద్వారా పలు చర్యలను చేపట్టడం జరిగిందని అన్నారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు సాధ్యమవుతుందని, ఇందుకుగాను సైబర్ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, సైబర్ నేరాలను పరిష్కరించేందుకు ఈ సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని తెలియజేశారు. సైబర్ నేరాలపై స్థానికంగానే ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కరించేందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిల్లోనే సైబర్ వారియర్లను ప్రత్యేకంగా నియమించడం జరిగిందని వివరించారు.
Also Read
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో మహిళలు, పిల్లలపై నమోదైన ప్రతి కేసులో సైబర్ పాత్ర ఉందని వెల్లడించారు. నైపుణ్యం గల ఐటి ప్రొఫెషనల్స్ తో ఏర్పాటుచేసిన ఈ సైబర్ ల్యాబ్ తో సైబర్ సంబంధిత నేరాలను నియంత్రించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా మాట్లాడుతూ… 2020-21 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ సంబంధిత నేరాల పరిష్కారం, నియంత్రణకు సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని అన్నారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మహిళలపై 7శాతం పిల్లలపై 5శాతం సైబర్ సంబంధిత నేరాల నమోదు పెరిగిందని తెలిపారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రాం, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, నేర పరిశోధన కోసం దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఆర్ అండ్ డి సెంటర్ లాగా పనిచేసే ఈ ల్యాబ్ లో నేరాల పరిశోధనకు సంబంధించిన అత్యాధునిక శాస్త్రీయ పరిజ్ఞానం, ఐటి సంబంధిత సాంకేతిక అంశాలను సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ అందిస్తుందని డి.ఐ.జి సుమతి పేర్కొన్నారు. సైబర్ ఆధారిత వేదింపులు, గృహహింసా , ఎన్నారై కేసులు, మానవ అక్రమ రవాణా, పిల్లలపై జరిగే లైంగిక వేదింపులు, చైల్డ్ ఫోర్నోగ్రఫి తదితర అంశాలపై ఈ సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!