తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం…
హైదరాబాద్ లో భారీ వర్షాలకు పురాతన, శిథిలావస్థలో వున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. బుధవారం ఓల్డ్ మలక్ పేట్ గంజ్ లోని మహబూబ్ మేన్షన్ ప్యాలెస్ చూస్తుండగానే కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వానలకు ఈ భవనం బాగా నానిపోయింది. చాలా కాలం నుంచి ఈ భవనం పటిష్టతపై అనుమానాలు వస్తూనే వున్నాయి. వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని…
ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు…
హైదరాబాద్ లో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆబిడ్స్ లోని గన్ఫౌండ్రీ ఎస్బీఐ కార్యాలయం ఆవరణలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్ఖాన్, కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్ పై కాల్పులు జరిపాడు. దీంతో సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సురేందర్ ప్రస్తుతం హైదర్గూడలోని…
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు కాస్త ఊరట కలిగించాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా నమోదయ్యాయి. తాజా ధరల ప్రకారం… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద కొనసాగుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.72 కు చేరింది.…
మన దేశంలో బంగారంకు ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గత వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. read also : “రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ? కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి…
మనుషులు తప్పిపోయినా ఫిర్యాదు చేసేందుకు వెనుకడు వేసేవారున్నారు.. పీడ విరగడైపోయింది అనుకునేవారూ లేకపోలేదు.. కానీ, తాము గారభంగా పెంచుకున్న పిల్లి తప్పిపోయిందంటూ ఓ జంతు ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించింది.. తప్పిపోయింది పిల్లేకదా అంటూ పోలీసులు లైట్ తీసుకున్నారు.. కేసు నమోదు చేయలేదు.. దీంతో.. తానే ఇలిల్లు తిరుగుతూ పిల్లకోసం వెతికింది.. అయినా ఆ పిల్ల ఆచూకీ దొరకకపోవడంతో.. మీడియాను పిలిచి.. తన గోడు వెల్లబోసుకుంది.. తన పిల్లి ఆచూకీ చెబితే ఏకంగా 30 వేల రూపాయలు రివార్డుగా…
తెలంగాణలో ఇటీవలే కొత్తగా ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ నిరాహర దీక్ష కొనసాగుతుంది. ఈరోజు వనపర్తి జిల్లాలోని తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. పీఆర్సీ ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, వెంటనే ఉద్యోగాలకు…
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,750 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820 వద్ద నిలకడగా ఉన్నది.…