Tragedy: మరో బస్సు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
- నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
- ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరువెళ్ల మెట్ట పై ARBCVR ట్రావెల్స్ బస్సు, లారీ దగ్ధం అయ్యాయి. బస్సు, లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మంటల్లో మృతి, బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందాడు. పలువురికి గాయాలు అయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు అద్దాలు పగలగొట్టడంతో బయటికి వచ్చారు బస్సులోని ప్రయాణీకులు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
Also Read:IND T20 Records: టీ20ల్లో భారత్ అరుదైన రికార్డు.. ఏకంగా 44 సార్లు, ఏ జట్టుకు సాధ్యం కాలే!
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
సిరువెళ్ల బస్, లారీ దగ్ధం ఘటనలో శ్రీవాణి ఆటో మొబైల్స్ కంటైనర్ లారీ(Ap39tp0626)లో బైక్ లు రవాణా చేస్తూ దగ్ధం అయ్యింది. ARBCVR ట్రావెల్స్ బస్సు( NL02B4647) దగ్ధం. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణీకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ప్రయాణీకులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ ఓబులేసు అలియాస్ భాస్కర్, (50) సజీవ దహనం అయ్యారు. కడప నివాసిగా గుర్తించారు. మృతిచెందిన లారీ డ్రైవర్, క్లీనర్ లను ఇంకా గుర్తించలేదు.
Also Read:Donald Trump: “గ్రీన్ల్యాండ్” అమెరికా భూభాగమే.. దావోస్లో ట్రంప్ ఫైరీ స్పీచ్..
నంద్యాల జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న ఆరుగురు సిరువెళ్ల బస్సు దగ్ధం బాధితులు.. ఇద్దరికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. నంద్యాల ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఎస్పీ సునీల్ షెరాన్.. బాధితుల నుంచి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. బస్సు దగ్ధం ఘటనలో గాయపడిన వారు హైద్రాబాద్ వాసులున్నారు.. చికిత్స పొందుతున్న శ్రీనివాసరెడ్డి, హరీష్, సునీత, గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు హైద్రాబాద్ కు పంపించారు. సిరువెళ్ల బస్సు దగ్ధమైన ఘటన లో ప్రయాణీకుల ప్రాణాలు కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్. క్లీనర్ అప్రమత్తం కాకుంటే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసేవని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణీకులు. క్లీనర్ ను అభినందించిన పోలీసులు. ప్రయాణీకులను కాపాడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ సురేంద్ర.
తాజావార్తలు
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి