Tragedy: మరో బస్సు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
- నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
- ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరువెళ్ల మెట్ట పై ARBCVR ట్రావెల్స్ బస్సు, లారీ దగ్ధం అయ్యాయి. బస్సు, లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మంటల్లో మృతి, బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందాడు. పలువురికి గాయాలు అయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు అద్దాలు పగలగొట్టడంతో బయటికి వచ్చారు బస్సులోని ప్రయాణీకులు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
Also Read:IND T20 Records: టీ20ల్లో భారత్ అరుదైన రికార్డు.. ఏకంగా 44 సార్లు, ఏ జట్టుకు సాధ్యం కాలే!
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
సిరువెళ్ల బస్, లారీ దగ్ధం ఘటనలో శ్రీవాణి ఆటో మొబైల్స్ కంటైనర్ లారీ(Ap39tp0626)లో బైక్ లు రవాణా చేస్తూ దగ్ధం అయ్యింది. ARBCVR ట్రావెల్స్ బస్సు( NL02B4647) దగ్ధం. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణీకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ప్రయాణీకులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ ఓబులేసు అలియాస్ భాస్కర్, (50) సజీవ దహనం అయ్యారు. కడప నివాసిగా గుర్తించారు. మృతిచెందిన లారీ డ్రైవర్, క్లీనర్ లను ఇంకా గుర్తించలేదు.
Also Read:Donald Trump: “గ్రీన్ల్యాండ్” అమెరికా భూభాగమే.. దావోస్లో ట్రంప్ ఫైరీ స్పీచ్..
నంద్యాల జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న ఆరుగురు సిరువెళ్ల బస్సు దగ్ధం బాధితులు.. ఇద్దరికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. నంద్యాల ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఎస్పీ సునీల్ షెరాన్.. బాధితుల నుంచి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. బస్సు దగ్ధం ఘటనలో గాయపడిన వారు హైద్రాబాద్ వాసులున్నారు.. చికిత్స పొందుతున్న శ్రీనివాసరెడ్డి, హరీష్, సునీత, గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు హైద్రాబాద్ కు పంపించారు. సిరువెళ్ల బస్సు దగ్ధమైన ఘటన లో ప్రయాణీకుల ప్రాణాలు కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్. క్లీనర్ అప్రమత్తం కాకుంటే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసేవని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణీకులు. క్లీనర్ ను అభినందించిన పోలీసులు. ప్రయాణీకులను కాపాడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ సురేంద్ర.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!