తెలంగాణలో చలి పెరగనుంది. ఈశాన్య భారతం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలి పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ సాయిలో నమోదవుతున్నాయని, ఎక్కడా పెద్దగా మార్పులు లేవని వివరించింది. అటు రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది. Read Also: చలికాలం చర్మ సంరక్షణ ఎలా? శుక్రవారం రాత్రి ఆదిలాబాద్లో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ…
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రేమ అమలు అవుతుందని, ఇక్కడ హక్కులు లేవని ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయనకు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడు తూ.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.ఈ విజయాన్ని హుజు రాబాద్ ప్రజలకే అంకితమిస్తున్నట్టు ఆయన తెలిపారు. అధికారులు కేసీఆర్కు బానిసలుగా పనిచేశారని ఆయన మండిపడ్డారు. తమ వర్గాన్ని పోలీసులు ఎలా బెదిరించారో తన దగ్గర సీడీలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్కు…
హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్త పార్టీ పెట్ట కండి… బీజేపీలోకి రండని ఈటలను ఒప్పించానని ఆయన చెప్పా రు. వారికి బండి సంజయ్, కిషన్రెడ్డి ఆయనకు భరోసా ఇచ్చార న్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని నిరూపించుకున్నామ న్నారు. ఈటల గెలుపును అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు శతవిధాల ప్రయత్నించారన్నారు. అయినా కూడా…
నోటీసులు ఇవ్వకుండానే మా ఇళ్లను కూల్చి వేస్తున్నారంటూ గోపన్ పల్లి స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేసేందుకు సమ యం అడిగిన ఇవ్వకుండా కూల్చి వేశారని బాధితులు వాపో యారు. 40,50 ఏళ్ల నుంచి ఇక్కడే బతుకుతున్నామన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇళ్లను కానీ, నగదును కానీ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రకళ మాట్లాడుతూ.. గోపన్పల్లి- తెల్లపూర్ మధ్యలో రోడ్డు నిర్మాణ పనులు…
తాము అండగా ఉంటామంటూ మృతిచెందిన రైతు కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య.. 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే.. ఇక, వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య…
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు యాదవులు తమ ఐక్యతను చాటుతూ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.. ఒక్కప్పుడు హైదరాబాద్కు పరిమితమైన ఈ ఆనవాయితీ క్రమంగా కాలనీలు.. టౌన్లు, గ్రామాలకు కూడా విస్తరించింది.. అయితే.. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు యాదవ సోదరులు.. ఇప్పటికే శుక్రవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సదర్ ఘనంగా జరగగా.. రెండో రోజులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్పల్లి, కాచిగూడ, ఈస్ట్ మారెడ్పల్లి సహా మరికొన్ని ప్రాంతాలతో పాటు..…
భాగ్యనగరంలో జరుగుతున్న సదర్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిని కనిపించినట్టు కుమ్మేసింది. ఖైరతాబాద్ చింతల్బస్తీలో ఈ సంఘటన జరిగింది. దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. జనంపై దూసుకెళ్లిన దున్నపోతు… స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చివరికి కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. కాగా.. హైదరాబాద్ మహా నగరం లో సదర్ పండుగ…
మొన్నటి దాకా దాదాపు కొన్ని నెలలుగా హుజురాబాద్ ఎలక్షన్తో బీజీ బీజీగా ఉన్న హరీష్ రావు శుక్రవారం సిద్ధిపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.12 గంటలు 12 కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని టీఆర్ఎస్ పార్టీ శ్రేణు ల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అటు ప్రజల మధ్య…ఇటు ప్రగతి కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు మంత్రి హరీష్. ” నాయకుడు అనే పదానికి కొత్త అర్థం చెప్పడంలో మంత్రి హరీష్…
సదర్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేళ ఓ దున్నపోతు వీరంగం చేసింది. ఖైరతాబాద్ చౌరస్తా లో దున్నపోతు గంట సేపు హల్ చల్ చేసింది. సదర్ ఉత్సవాలకు ముస్తాబు చేస్తుండగా తాడు తెంపుకొని పరుగు తీసింది ఓ దున్నపోతు. రోడ్డుపై వున్న స్కూటీనీ కొంత దూరం లాక్కెళ్లి పోయింది దున్నపోతు. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎట్టకేలకు దున్నపోతును బంధించారు యాదవులు. ఏటా దీపావళి అనంతరం హైదరాబాద్ లో సదరు ఉత్సవం నిర్వహించడం…
జూబ్లీహిల్స్లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకోవడంతో ఆ షోరూంకి వెళ్ళాలంటేనే యువతులు భయపడుతున్నారు. ఈ షోరూంపై కేసు నమోదు కావడంతో హెచ్ అండ్ ఎం షోరూం క్లోజ్ చేశారు నిర్వాహకులు. ట్రయల్ రూమ్లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ రూం నుంచి ఇద్దరు యువకులు మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్నఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి.. చాకచక్యంగా వ్యవహరించి ఆ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.…