భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కార్తీక మాసాన హైదరాబాద్ జంట నగర ప్రజలను ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురువారం ఏడోరోజుకు చేరింది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఏడోరోజు వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చారు. ఏడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు. ఏడోరోజు సందర్భంగా…
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు.…
తెలంగాణలో సీఎం కేసీఆర్కు వీరాభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా కేసీఆర్ను తిడితే కొందరు అభిమానులు వెంటనే స్పందించి ఎదురుదాడికి దిగుతుంటారు. కేసీఆర్కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే ఆయనకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. Read Also: సింహంతో వేట.. జగన్తో ఆట మంచిది కాదు: ఎమ్మెల్యే రోజా సీఎం కేసీఆర్ను తిడుతున్నారని ఆరోపిస్తూ… రాజ్భవన్ ఎదుట సూర్యాపేటకు చెందిన టీఆర్ఎస్…
కోఠి డీఎంఏ కార్యాలయంలో రూ. 1.41 కోట్ల విలువైన నాలుగు అంబులెన్సు వాహనాలను ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఇలాంటి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. నాలుగు అంబులెన్సుల వాహనాల్లో లైఫ్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇవి బోధన్ ఆస్పత్రిలో ఈ వాహనాలను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 108,104 ద్వారా అంబులెన్స్ సేవలను అందిస్తుందని తెలిపారు. వీటిలో పాడైపోయిన వాటి స్థానంలో…
రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారింది పరిస్థితి… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. కేంద్రం చెప్పేది ఒకటైతే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మరో మార్గం ద్వారా రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.. ఇక కేంద్రంపై యుద్ధం ప్రకటించి మహాధర్నాకు దిగారు గులాబీ పార్టీ దళపతి కేసీఆర్.. అయితే.. ఈ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ…
సాధారణంగా బయట ఏ4 సైజు పేపర్ను వాడితే.. కోర్టులు, రిజిస్ట్రేషన్ కార్యాలయలు.. ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు.. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్ను ఉపయోగించడంపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.. తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు..…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీబీఐ.. హైదరాబాద్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు… ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారిన సంగతి తెలిసిందే కాగా.. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తారంటూ వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.. అయితే,…
వంటింట్లో టమాటా ఉండాల్సిందే..! ప్రతీ కూరలోనూ టమాటా వాడాల్సిందే..! అప్పుడే ఆ కూరకు టెస్ట్ వస్తుంది.. కానీ, ఇప్పుడు టమాటా దొరకడమే కష్టంగా మారే పరిస్థితి కనిపనిస్తోంది.. ఎందుకంటే.. ఎప్పుడూ మార్కెట్కు పెద్ద ఎత్తున తరలివచ్చే టమాటా ఇప్పుడు కనిపించడంలేదు.. మార్కెట్లు, రైతు బజారుల్లోనూ టమాటా జాడ కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. టమాటా ధర క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. సూపర్ మార్కెట్లు నేరుగా రైతు దగ్గరకే వెళ్లి టమాటాలు కొనేస్తున్నారు. క్రమంగా సూపర్…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.. రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి బాసటగా నిలిచారు.. తన కాన్వాయ్లోనే ఆస్పత్రికి తరలించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి సమయంలో మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. గాయాలపాలై సాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో.. అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్.. ఆ దృశ్యాలను గమనించారు.. వెంటనే కాన్వాయ్ని ఆపి కిందికి దిగారు.. విద్యార్థులను…
హైదరాబాద్లో యోధా లైఫ్లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభమైంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవిలు ప్రారంభించారు. వైద్యరంగంలో అనేక పెనుమార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరంలో వైద్యం అందుబాటులోకి వస్తోందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీనోమ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జీన్స్ ను ఆధారంగా చేసుకొని మనిషికి వచ్చే జబ్బులను ముందుగానే తెలుసుకోవచ్చని అన్నారు. కరోనా సమయంలో జీనోమ్…