రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసింది: షబ్బీర్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. పీసీసీ, పీఏసీ జాయింట్ సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలని అనుకున్నామని, కానీ రోశయ్య మరణంతో ఆయన మరణం పైనే చర్చించామని షబ్బీర్ అలీ మీడియాకు తెలిపారు. రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందన్నారు.ఈ రోజు సమావేశంలో రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించినట్టు తెలిపారు. రేపు గాంధీ భవన్ లో 11 నుండి 12 వరకు రోశయ్య పార్థివ దేహాన్ని వుంచనున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణులు నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా చూడ్డానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. హైదరాబాద్ లో రోశయ్య మెమోరియల్, లైబ్రరీ ఏర్పాటు చేయాలని షబ్బీర్ అలీ అన్నారు. ఇవ్వాల జరిగిన ఈ సమావేశంలో ఈ తీర్మానం చేశామని తెలిపారు. మా తీర్మానం సీఎం కేసీఆర్ కు అందజేస్తామని వెల్లడించారు. రోశయ్యకు భయపడి ఎన్టీఆర్ కౌన్సిల్ రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
రోశయ్య కుటుంబం మాకు మొదటి నుండి పరిచయం: గీతారెడ్డి
రోశయ్య కుటుంబం మాకు మొదటి నుండి పరిచయమని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. నా దగ్గరికి రెగ్యూలర్గా రోశయ్య కుటుంబ సభ్యులు మెడికల్ చెకప్ కోసం నాదగ్గరికి వచ్చేవారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్య 50 ఏళ్లు సేవలందించారని ఆమె కొనియాడారు. ఆర్థిక శాఖ మంత్రిగా రోశయ్యకు మంచి గుర్తింపు వచ్చిందని ఆమె అన్నారు. ఎవరికీ కీడు చేయని వ్యక్తి రోశయ్య అన్నారు. కొంపల్లిలోని ఫాం హౌస్లో రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని గీతారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!