హైదరాబాద్లో ఎంఎంటీఎస్కు పెను ప్రమాదం తప్పింది… బేగంపేట నుంచి నాంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్కు నెక్లెస్ రోడ్ దగ్గర ప్రమాదం తప్పిపోయింది… సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా నెక్లెస్ రోడ్ దగ్గర ఆగిపోయింది ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్… రన్నింగ్లో ఉన్న ట్రైన్ ఒక్కసారి పెద్ద శబ్దంతో ఆగిపోయింది… దీంతో, కంగారు పడిన ప్రయాణికులు.. భయాందోళనతో ట్రైన్ దిగి పరుగులు తీశారు.. ఉదయాన్నే ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో… ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు…
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కూడా నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Read Also: CM KCR Yadadri Tour: నేడు యాదాద్రికి…
మూడు రోజుల నుంచి రాష్ట్రాన్ని వర్షం కమ్మేసింది. మూడురోజులుగా కురుస్తున్న భారీ వానలు రాష్ట్రం తడిసి ముద్దైంది. పలు చోటు అధిక వర్షపాతం నమోదైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నిన్న హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి.. స్వప్న అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆమె మృతదేహాన్ని ఇప్పటివరకు పోలీసులు వెళికి తీయకపోవడంతో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బిర్యానీ ఫైటింగ్ వ్యవహారం హోం మంత్రి మహమూద్ అలీ వరకు వెళ్లింది… హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. ఇక, ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచి ఉండే సందర్భాలు ఉంటాయి… మరికొన్ని రాత్రి 11 గంటలకే మూత పడుతున్నాయి.. ఇంకా కొన్ని హోటల్స్ చాటుమాటుగా.. అర్ధరాత్రి వరకు బిర్యానీ, ఇతర విక్రయాలు కొనసాగిస్తూనే ఉంటాయి.. అయితే, అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్…
ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ కింద అడ్వైజరీ బోర్డు విచారణ జరపనుంది. ఇవాళ అడ్వైజరీ బోర్డు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు. జైలు నుంచే వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించనుంది అడ్వైజరీ బోర్డు. ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులతో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు కమిటీ విచారించనుంది.
వరకట్న వేధింపు తాళలేక ఖానాపూర్ కు చెందిన నూర్జహాన్ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స తీసుకుంటుంది. ప్రేమపేరుతో మోసపోవద్దని వాట్సప్ లో వాయిస్ రికార్డ్ వీడియో వైరల్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి…