పీసీసీ మెంబర్స్ సమావేశంలో విహెచ్, ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ నెలకొంది. ఓబీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని వీహెచ్ అనడంతో..వీహెచ్ కి మైక్ ఇచ్చిన ఖర్గే .. మైక్ లేకుండానే మాట్లాడు మైక్ లో మాట్లాడితే మేము Ent డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది అంటూ వీహెచ్ పై సెటైర్లు వేశారు.
దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కల్వకుర్తి, కడప వాసులుగా గుర్తించారు.
JC Prabhakar Reddy: బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం నాడు జేసీ ప్రభాకర్రెడ్డి హైదరాబాద్లో ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి ఆయన కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు జరిగాయి. అయితే కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రైవేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది. తాజాగా ఈడీ కార్యాలయంలో…
హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ వేళలను మరింతగా పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.15 గంటల వరకే హైదరాబాద్లో మెట్రో సేవలు అందుతుండగా.. ఇకపై రాత్రి 11 గంటలకు పెంచాలని హైదరాబాద్ మెట్రోరైలు నిర్ణయించింది.
హైదరాబాద్లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రటైంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను హయత్ నగర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సభ్యులను మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర, చంద్రేశ్ లను అదుపులో తీసుకున్నామని తెలిపారు.
దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవం తీర్మానం చేసిన విషయం తెలసిందే.. ఇక, ఈ తీర్మానం కాపీని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు బీఆర్ఎస్ నేతలు… తెలంగాణ సీఎం ఇప్పటికే అనేకమార్లు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్.. ఇప్పుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది..…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. కాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు.. ఇక, సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా కర్నాటక నుంచి ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం ప్రగతిభవన్కు వచ్చింది.. వీరికి ఆహ్వానం పలికారు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు.. అదే సందర్భంగా., తమిళ నాడు నుంచి…
టీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు.. దాని కోసం.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు, ఇప్పటికే వాడుతున్న గులాబీ రంగులను కొనసాగిస్తూ.. పార్టీ పేరును మాత్రం మార్రచేస్తున్నారు.. అనేక పేర్లు పరిశీలించిన చివరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఆయన మెగ్గు చూపినట్టు తెలుస్తోంది.. తెలంగాణ గడ్డపై ఆవిర్భవిస్తోన్న ఆ కొత్త పార్టీకి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం