JC Prabhakar Reddy: లారీలు కొన్న వ్యక్తిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం నాడు జేసీ ప్రభాకర్రెడ్డి హైదరాబాద్లో ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి ఆయన కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు జరిగాయి. అయితే కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రైవేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది. తాజాగా ఈడీ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి హాజరు కావటం ఆసక్తి రేపుతోంది.
Read Also: నిమ్మ కాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
Also Read
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
కాగా ఈడీ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వెల్లడించారు. లారీల కొనుగోలు అంశంపై అధికారులు తనను ప్రశ్నించారని.. ఈడీ అంటేనే అందరూ భయపడతారని.. తమ లాంటి వారికి నిజాయితీని నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటు అన్నారు. లారీలు కొనుగోలు చేసిన వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని జేసీ ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. అశోక్ లైలాండ్ లారీలు వ్యవహారం అన్నప్పుడు వారినే అడగాలని.. ఇది కోట్లు స్కాం ఏమీ కాదు కదా అని నిలదీశారు. మనీలాండరింగ్కు తాను పాల్పడలేదన్నారు. ఈడీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానని.. ఈ కేసుతో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఈడీ ఎప్పుడు విచారణకు పిలిచినా తాను సహకరిస్తానని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!