Cyber Crime: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్కి వార్నింగ్.. క్రిమినల్స్ చేతికి గ్రూప్ డేటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది.. కొత్త యాప్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మారుతున్న కాలంతో పాటు నేరం కూడా కొత్త రూపం దాల్చడం మొదలైంది. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు ప్రత్యక్షంగా మీ దగ్గరకు లేదా మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మీకు సంబంధించిన వివరాలు తెలిస్తే చాలు.. ఒక్క లింక్ మీ ఫోన్ కు పంపడం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు. ఒక పద్ధతి గురించి ప్రజలకు తెలియగానే.. మరో పద్ధతిలో దొంగిలించడానికి వీరి వద్ద ప్లాన్ రెడీగా ఉంటున్నట్టు చాలా ఘటనలు ఫ్రూవ్ చేశాయి కూగా.. తాజాగా వాట్సాప్ ద్వారా కూడా కొంతమంది డబ్బు పోగొట్టుకున్నామని ఫిర్యాదులు చేయడం కలకలం సృష్టిస్తోంది.. ఈ సమయంలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Read Also: Crime News: పది రూపాయల కోసం ఫ్రెండ్ను రాయితో కొట్టి చంపిన యువకుడు
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
ఎందుకంటే.. మీ గ్రూప్ మెంబెర్స్ డేటా అంతా క్రిమినల్స్ కి చేరిపోతోంది.. అప్రమత్తంగా ఉండాలంటూ.. సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.. అమెరికాలోని ఎన్నారైలకు సైబర్ మోసాలు తప్పడం లేదు.. అమెరికాకి చెందిన వాట్సప్ గ్రూప్స్ నుండి డేటా సేకరిస్తున్న సైబర్ చీటర్స్… ఓ ఎన్నారై మహిళకు 1 లక్ష రూపాయల లోన్ కట్టాలని.. బెదిరింపులకు దిగారు.. అంతేకాదు.. ఆమె స్నేహితులకు కూడా వేధింపులు తప్పలేదు.. నేరుగా ఇండియా నోయిడాలోని బ్యాంక్ కి వచ్చి సెటిల్ చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు కేటుగాళ్లు.. ఇప్పటికే లక్షల రూపాయలు చీటర్స్ చేతిలో మోసపోయారు ఎన్నారైలు.. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ నేపథ్యంలోనే.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్.. అప్రమత్తంగా ఉండాలని.. తమ గ్రూప్లో యాడ్ చేసేవారిని ఓ కంటకనిపెట్టాలనే.. లేకపోతే.. డేటా మొత్తం దొంగిలించి ఎసరు పెడతారని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?