మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో మంచి పేరు కలిగిన వ్యక్తి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేసీఆర్ నివాళులు ఆర్పించారు.
ఇవాళ ( సోమవారం ) జరిగిన కేబినెట్ సమావేశంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం, ప్రతి ఒక్కరు హర్షించదగిన విషయం.. ఈ విలీన నిర్ణయం తీసుకున్నందుకు TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి JAC కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
భారీ వర్షం హైదరాబాద్ నగరానికి మరోసారి వణికించింది. ఇవాళ (సోమవారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసిన సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, నగరంలో చాలా చోట్ల వాన నీరు రోడ్ల పైన నిలిచిపోయింది.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10:30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలుకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
తెలంగాణలో ఒక్కసారి కూడా అసెంబ్లీని 30 రోజులు నడపక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేడు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
మరికాసేపట్లో డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ మీటింగ్ లో 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Car Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఫిలింనగర్ ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్ తో చెట్టు, ఎలక్ట్రికల్ పోల్, గోడని ఢీ కొట్టింది.