Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
- సీజేపీ వేదికపై కానిస్టేబుల్ షేర్ సింగ్ రాజీనామా..
- గ్యాంగ్స్టర్తో లింక్ ఉన్నట్లుగా ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటన..
- 2025లోనే షేర్ సింగ్పై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన వేదికపై నుంచి ఉత్తరాఖండ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తన భుజానికి ఉన్న బ్యాడ్జీని తీసేసి, అభిజిత్ దీప్కేకు అప్పగించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న నిరసనకారులు అతడిని పొగుడుతూ, చప్పట్లతో నినానాలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షేర్ సింగ్ ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నాడని, అతడిపై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించారు.
ఐజీ కుమావోన్ నివేదిక కుక్రేటి తెలిపిన వివరాల ప్రకారం.. షేర్ సింగ్ చాలా కాలంలో క్రియాశీలక పోలీస్ విధుల్లో లేరు. 2025లో ఓ క్రిమినల్ కేసులో అరెస్టైన తర్వాత అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతడిపై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నిర్వహిస్తోంది. షేర్ సింగ్కు హరిద్వార్-రూర్కీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్ ప్రవీణ్ వాల్మీకి ముఠాతో సంబంధాలు ఉన్నాయి. ప్రజల్ని బెదిరించి భూములను అక్రమంగా ఆక్రమించడం, నకిలీ పత్రాల ద్వారా ఆస్తుల్ని బదిలీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్గా ఉన్న షేర్ సింగ్, సితార్గంజ్ జైలులో మరియు రూర్కీ కోర్టులో గ్యాంగ్స్టర్ ప్రవీణ్ వాల్మీకిని పలుమార్లు కలవడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఒక వితంతువుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు నిందితులకు సహకరించినట్లు పోలీసులు ఆరోపించారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడం, కోర్టులో బాధితురాలని బెదిరించే ప్రయత్నం చేయడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఆధారాలు సేకరించిన తర్వాత 2025 సెప్టెంబర్ 15న షేర్ సింగ్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీని తర్వాత నైనిటాల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు తర్వాత విధుల నుంచి సస్పెండ్ అయ్యారు.
తాజావార్తలు
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
-
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!