Hyderabad: ట్రాఫిక్ అలర్ట్.. 11 రోజులు, ఈ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నగరంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే మనకు గుర్తొస్తాయి. ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్ గణేశుడు నగరంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ప్రసిద్ధి చెందాడు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Read also: Indian Navy Fleet: నేవీలోకి 175 కొత్త యుద్ధనౌకలు.. సముద్రంలో చైనాకు గట్టి పోటీ ఇవ్వనున్న భారత్
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
రాజ్దూత్ లైన్ – గణేష్ తరహా రహదారిపై వాహనాలను అనుమతించరు. రాజ్ దత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను మళ్లిస్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వరకు సాధారణ ట్రాఫిక్కు అనుమతి లేదు. ఆ వైపు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ నుండి IMAX థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతించబడదు. మింట్ శ్రీ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు సూచించారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఉంటే, దయచేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్లైన్ – 9010203626ను సంప్రదించాలని కోరారు.
Madhya Pradesh Rain: మధ్య ప్రదేశ్ లో వర్ష బీభత్సం.. ఝబువాలో ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!