అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే USAలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లను కలిగి ఉన్నాయని.. USA నుంచి హైదరాబాద్కు నేరుగా విమానాన్ని నడపటం వల్ల పెద్ద పట్టణాలతో సమానంగా అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు.
గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల కోసం నాకు ఎక్కడ నుంచి అధికారిక ఇన్విటేషన్ రాలేదు అని ఆమె పేర్కొన్నారు. రాజ్ భవన్ మహిళలు మాత్రం నన్ను బోనాలకు ఆహ్వానించారు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదు అని గవర్నర్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో మెయింటనెన్స్ వర్క్స్ దృష్ట్యా పలు ట్రైన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని తెలిపారు. బోనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపునా లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయానికి వచ్చారు. గోల్కొండ బోనాలతో మొదలైన బోనాలు సికింద్రాబాద్ లో ఇప్పుడు లాల్ దర్వాజ్ జరుపుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్లోని దోమలగూడలో గ్యాస్ సిలీండర్ పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. దీంతో ఈ ప్రమాద సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ నెల 10వ తేదీన గ్యాస్ సిలీండర్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తెలంగాణ ఆర్టీసీలో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లతో ముందుకు వెళ్తున్న యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను తొలిగించేందుకు శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే క్యాష్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టంను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తిగా చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోడానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. లాల్దర్వాజా బోనాల పండగా సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు ఆషాడమాసంలో సంప్రదాయంలో భాగంగా బోనాల ఉత్సవాల పండగ జరుపుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ ఉండటంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మద్యం షాపులు క్లోజో చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందుబాబులు అర్థరాత్రి వరకు వైన్ షాప్స్ ముందు మందు కొనుగోలు చేశారు.