పలు అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ క్లాబ్స్ పై కమిటీ వేటు వేసింది. 80 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది గుర్తించి.. ఆ 12 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు హెచ్సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. అందుకోసమే.. హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయా క్లబ్ల్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీలపై నిషేధం విధించింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం ఆగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్బస్ నిన్న (మంగళవారం) శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇల్లా ఎయిర్బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావడం ఇది సెకండ్ టైం.
డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు.
ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ జి. స్వర్ణలత పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, మరణించిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తన దృష్టంతా అటువైపుగా మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద మూడు రోజుల పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అండర్-16 బాయ్స్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని జిల్లాల నుంచి వందల మంది ఈ సెలక్షన్స్ కి హాజరు అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్స్ రావడంతో HCA వెనక్కి పంపించింది.
హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు. 69,100 కోట్లతో నగరం నలుదిశలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవు
పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి వ్యతిరేఖం కాదు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను వెనక్కి పంపడంపై నా అభ్యంతరాలను క్లియర్ గా తెలిపాను అన్నారు.
HYD ED Raids: హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.