Hyderabad Crime: అంబర్పేటలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు (16) ఘాటుకి దిగాడు. ప్రేమించాలంటూ ఓ అమ్మాయిపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై కనిపించాడు.
Property Rates: ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కల. రోజు రోజుకు సామాన్యులు ఆ కలను నెరవేర్చుకునేందుకు నానాకష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా స్థిరాస్తుల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం.
Shavarma: హైదరాబాద్లోని అల్వాల్లో షవర్మా తిని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు, ఐదు రోజుల్లో బాధితుల సంఖ్య 17 కి చేరుకుంది.
Vikarabad Crime: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. అటవీ ప్రాంతంలో మహిళ మెడకు చీర కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు హంతకుడు.
Nampally Court: హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్తకు మరణశిక్ష పడింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది..
ఈ రోజు జనసేన అధినేత పవన్కల్యాణ్తో సమావేశం కానున్నారు.. హైదరాబాద్లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు వెళ్లనున్న ఎంపీ బాలశౌరి.. జనసేనానితో చర్చలు జరపనున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేనలో ఆయన పాత్ర ఏంటి? ఏ స్థానం నుంచి పోటీ చేయాలి..? అనే అంశాలపై పవన్తో చర్చించబోతున్నారు.. అయితే, మచిలీపట్నం లేదా గుంటూరు లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.…
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణను తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ కలిశారు. రేపటి (జనవరి 19) నుంచి హైదరాబాద్ లో తెలుగు టైటాన్స్ కు చెందిన మ్యాచ్లు మొదలుకానున్నాయి.
అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారని, ఆ దిశగా సరలీకరిస్తున్నామని జ్యోతిరాదిత్య తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్ట్లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను గురువారం ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.…
బేగంపేట ఎయిర్ పోర్ట్లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆరంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏవియేషన్ రంగనిపుణులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.…