Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి.
Accident: ఓవర్టేక్ చేస్తూ బైక్, ఆటోని ఢీకొట్టిన స్కార్పియో.. ఏడుగురు దుర్మరణం..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భావనతో గత 7 ఏండ్లుగా భారతమాతకి మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహా హారతి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమం.. ఇది ఏ సంస్థకు చెందింది కాదని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా మహా హారతి కార్యక్రమంను ఆనవాయితీగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేయడానికి భారతమాత ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Pakistan: న్యూమోనియాతో పాకిస్తాన్లో 200 మంది పిల్లలు మృతి..
అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. భాగ్యనగరంలో భారతమాతకి మహా హారతి 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇతర దేశం వారు దేశాన్ని తండ్రిగా భావిస్తారు.. కానీ మన దేశంలో తల్లిగా భావిస్తామని అన్నారు. మన దేశంలో మాతృభూమికి అంతటి గొప్పతనం ఉంది.. వేరే ఇతరులకు ఆ సాంస్కృతి లేదని పేర్కొన్నారు. మనం భారతీయులుగా ఉండడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. భారత భూమికి భారత మాత మృతికకు ఉండే గొప్పతనం అని తెలిపారు. భారత దేశానికి రెండు గొప్పతనాలు ఉన్నాయి. ఒకటి మట్టికి పరిమళం.. ఇంకోటి రుచి ఉన్నది మట్టిలోనని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను ఇక్కడి మట్టిలో ఉన్న పరిమళం మరి ఎక్కడ లేదన్నారు. మన మట్టిలో పుట్టిన ప్రతి మనిషికి ప్రేమ, రుచి, మంచి పనులు చేయాలనే పరిమళం ఉంటుందని చినజీయర్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!