Komatireddy Venkat Reddy: మెగాస్టార్ ఇంటికి కోమటిరెడ్డి.. శాలువా కప్పి శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవికి శాలువాకప్పి, పుష్పగుచ్చం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగు ప్రజల తరఫున, చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులను చిరంజీవి పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి సందేశాత్మక సినిమాలు తీశారని అన్నారు. నేను యువకుడుగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలను చూసేవాన్ని అంటూ హాస్యాస్పదం చేశారు. ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పొందడం గర్వకారణమన్నారు. చిరంజీవికి భారత రత్నతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తెలుగువాడైన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్లి పద్మ వైభవిషయం దక్కడం తెలుగు వారికి గర్వకరణమన్నారు.
Read also: TSPSC Chairman: నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకోనున్న మహేందర్ రెడ్డి
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి ‘విశ్వంభర’ వరకు సాగుతున్న సినిమా ప్రస్థానమని కొనియాడారు. రక్తదానం, నేత్రదానంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున చిరంజీవికి మరోసారి అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాజకీయాలు, సినిమాల్లో ఎలాంటి నేపథ్యం లేకుండా అతి సామాన్యులుగా ప్రారంభించి, స్వయం కృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు చేరుకున్న ఇద్దరు అసామాన్య తెలుగు తేజలకు పద్మవిభూషణ్! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. మరొకరు తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను గురువారం ప్రకటించింది.
Tamilisai: సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి పాలన..
తాజావార్తలు
-
Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!