Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- హైదరాబాద్ హఫీజ్పేట్లో విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం
- “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” ద్వారా నిరుద్యోగులను టార్గెట్ చేసిన నిర్వాహకులు
- ఈజిప్ట్, ఇజ్రాయెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ
- ఒక్కో వ్యక్తి నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు
- సుమారు 90 మంది యువకులు మోసపోయినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Scam: హైదరాబాద్ నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ ప్రాంతంలో “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” పేరుతో నడుస్తున్న సంస్థ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన సంచలనంగా మారింది. ఈ మోసంలో సుమారు 90 మంది యువకులు బలైపోయారు.
ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించారు. విదేశాల్లో ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూసిన యువకుల్లో కొంతమందిని ఈజిప్ట్ వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కన్సల్టెన్సీ నిర్వాహకులు ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి సొంత ఖర్చులతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు బాధితులు వాపోయారు.
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
ఇక హఫీజ్పేట్లో ఉన్న కన్సల్టెన్సీ కార్యాలయం అకస్మాత్తుగా మూతపడటంతో మోసపోయిన నిరుద్యోగులు షాక్కు గురయ్యారు. కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితులకు తాళాలు వేసి ఉండటం కనిపించడంతో మోసం జరిగిన విషయం బయటపడింది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు, అధికారిక ధృవీకరణలు ఉన్న సంస్థల ద్వారానే విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు.
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!