Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- హైదరాబాద్ హఫీజ్పేట్లో విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం
- “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” ద్వారా నిరుద్యోగులను టార్గెట్ చేసిన నిర్వాహకులు
- ఈజిప్ట్, ఇజ్రాయెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ
- ఒక్కో వ్యక్తి నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు
- సుమారు 90 మంది యువకులు మోసపోయినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Scam: హైదరాబాద్ నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ ప్రాంతంలో “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” పేరుతో నడుస్తున్న సంస్థ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన సంచలనంగా మారింది. ఈ మోసంలో సుమారు 90 మంది యువకులు బలైపోయారు.
ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించారు. విదేశాల్లో ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూసిన యువకుల్లో కొంతమందిని ఈజిప్ట్ వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కన్సల్టెన్సీ నిర్వాహకులు ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి సొంత ఖర్చులతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు బాధితులు వాపోయారు.
Also Read
- G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
- India A vs Sri Lanka A: మొదట తిలక్ వర్మ.. తర్వాత వైభవ్ సూర్యవంశీ.. గందరగోళంగా భారత్-శ్రీలంక మ్యాచ్
- Off The Record: తూర్పు కాపుల వరుస సమావేశాల వెనుక కారణమేంటి ?
ఇక హఫీజ్పేట్లో ఉన్న కన్సల్టెన్సీ కార్యాలయం అకస్మాత్తుగా మూతపడటంతో మోసపోయిన నిరుద్యోగులు షాక్కు గురయ్యారు. కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితులకు తాళాలు వేసి ఉండటం కనిపించడంతో మోసం జరిగిన విషయం బయటపడింది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు, అధికారిక ధృవీకరణలు ఉన్న సంస్థల ద్వారానే విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు.
తాజావార్తలు
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
-
Bhatti Vikramarka : ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా పనిచేయాలి
-
Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
-
Anirudh: సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టిన అనిరుధ్.. ఇండిపెండెంట్ మ్యూజిక్తో మ్యాజిక్
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!