Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
కేవలం 4 సంవత్సరాలపాటు మాత్రమే ఉద్యోగాలు కల్పించే అగ్నివీర్ పథకం యువతను సైన్యంలో చేరకుండా నిరుత్సాహపరిచిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శనివారం కాస్త ఘాటుగా స్పందించారు. హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన తన సొంత నియోజకవర్గం నాదౌన్లో విలేకరులతో సంభాషించిన ఆయన., కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద ఎత్తున వాదనలు చేసినప్పటికీ.. ఉనా, హమీర్పూర్ మధ్య రైలు మార్గం పనులు కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు. ఠాకూర్ హమీర్పూర్ నుంచి బీజేపీ…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ట్రాన్స్ జెండర్ ఐకాన్ మాయా ఠాకూర్ తన జీవితంలో పడ్డ కష్టాలను గురించి తెలిపింది. తొమ్మిదో తరగతి తర్వాత బలవంతంగా చదువు మానేయాల్సి వచ్చింది. కాగా.. మాయ ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఐకాన్గా మారింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో విద్యార్థులు, టీచర్ల నుంచి తాను ఏకపక్ష ప్రవర్తనను ఎదుర్కొన్నానని ట్రాన్స్జెండర్ ఐకాన్ తెలిపింది. దీంతో.. ఆమె పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయిందని చెప్పింది. సిమ్లా పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని సోలన్…
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉక్కపోత, వేడిగాలుల నుండి ప్రజలు త్వరలో ఉపశమనం పొందబోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
బీజేపీ ఎంపీ అభ్యర్థి, బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ మరోసారి మోడీ పాలనను ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనారనౌత్.. మండి సెగ్మెంట్లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కంగనాను బీజేపీ పోటీకి దింపింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా రనౌత్ సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదని చెప్పారు.
సినీ నటి, బీజేపీ మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య మరోసారి ఫైర్ అయ్యారు. కంగనా రనౌత్ కేవలం ఎన్నికల కోసం దిగుమతి చేసుకున్న నాయకురాలని విక్రమాధిత్య సింగ్ విమర్శించారు.
Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్కు రైతులు షాకిచ్చారు. తన అవమానకరమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మన సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.