Loksabha Elections 2024 : హిమాచల్లో సుఖూ ప్రభుత్వ భవిష్యత్ నిర్ణయించనున్న ఉప ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నిక హిమాచల్లోని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఈ ఎన్నికలతో సుఖూ ప్రభుత్వ విశ్వసనీయత ప్రమాదంలో పడింది. హిమాచల్లో సుజన్పూర్, ధర్మశాల, లాహౌల్-స్పితి, బుర్సర్, గాగ్రెట్, కుత్లహర్లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తిరుగుబాటు నేతలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో, చైతన్య శర్మ, ఇందర్ దత్ లఖన్పాల్, రవి ఠాకూర్ బీజేపీ టికెట్పై పోటీ చేశారు. దీని వల్ల ఇప్పుడు ఈ సీట్లపై సుఖూ ప్రభుత్వాన్ని నిలబెడుతుందా లేక ప్రభుత్వం ఘోరంగా దెబ్బతింటుందా అనేది చూడాలి మరి.. బీజేపీకి మళ్లీ అధికారం దక్కించుకోవడానికి ఇదే పెద్ద అవకాశం.
Read Also:Manamey : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..
Also Read
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
తిరుగుబాటు నేతలు బీజేపీలో చేరారు
హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ సెషన్లో, పార్టీ విప్ను ఉల్లంఘించినందుకు ఆరుగురు తిరుగుబాటుదారులపై కాంగ్రెస్ అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఆరు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 29న రాజ్యసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఓటు వేశారు. తరువాత ఎమ్మెల్యేలందరూ బిజెపి పార్టీలో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలంతా బీజేపీ టిక్కెట్పై తమ తమ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
Read Also:AP-TG Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..
సుక్కు భవిష్యత్తును తేల్చనున్న ఉప ఎన్నికలు
ఈ ఎన్నికల్లో సీఎం సుక్కు చాలా పడింది. ఈ ఆరు స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు సీఎం సుక్కు రాజకీయ భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీజేపీకి, కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి పొందేందుకు ఇదే అవకాశం. 2022లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 40 సీట్లు, బీజేపీ 25 సీట్లు, ఇతరులు మూడు సీట్లు గెలుచుకున్నారు. అయితే, 2014 – 2019 సంవత్సరాల్లో, హిమాచల్ ప్రదేశ్లోని అన్ని లోక్సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది.
తాజావార్తలు
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..