ఏపీలో సంచలనం కలిగించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు.…
డబ్బు చెల్లిస్తారా? అప్పీల్కు వెళ్తారా? స్మితా సబర్వాల్. తెలంగాణ సీఎంవో కార్యదర్శి. హైకోర్టు ఆదేశాలతో తాజాగా చర్చల్లోకి వచ్చారు ఈ మహిళా ఐఏఎస్. 90 రోజుల్లో ప్రభుత్వానికి ఆమె 15 లక్షలు కట్టాలి. లేకపోతే ప్రభుత్వమే ఆమె నుంచి ఆ మొత్తాన్ని వసులు చేయాలన్నది ధర్మాసనం ఆదేశాలు. దీంతో ఈ కేసు పూర్వాపరాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 15 లక్షలు స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి కడతారా? లేక అప్పీలుకు వెళ్తారా? ఈ అంశంలో…
ఢిల్లీలో కేంద్ర MSME శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ను కలిశారు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు. అమరావతి లో “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థ” కు ఐదు ఎకరాల భూమిని శాఖమూరు గ్రామంలో 60 సంవత్సరాల లీజుకు కేటాయించడమైనదని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 20.45 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ…
ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ అవుతోంది. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్లు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. శుక్రవారం కేవియట్ పిటిషన్లను అడ్మిట్ చేసుకుంది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వస్తే తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వద్దని కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి రాజధానికి సంబంధించి మరో చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పిన…
ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మూడు రాజధానులపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం అమరావతిలోనే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానులు ఆలోచన చేస్తోందన్నారు. ఈ మూడురాజధానులకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం…
ఏపీలో చింతామణి నాటకంపై నిషేధం వివాదాస్పదం అవుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ మండిపడుతున్నారు. సుబ్బిశెట్టి పాత్రను వికృతంగా చిత్రీకరిస్తున్నారని అందుకే చింతామణి నాటకంపై నిషేధం విధించారన్నారు కార్పోరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. దీనికి రఘురామ ఏంచెబుతారంటూ నిలదీశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం తెలిసిందే. ఆర్యవైశ్య సంఘాల డిమాండ్ ను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే…
ఏపీలో పీఆర్సీ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలిచింది. అయితే అక్కడి పరిణామాలపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఐఏఎస్ అధికారులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. సీఎస్ సమీర్ శర్మ మమ్మల్ని అవమానించారు. నలుగురం జేఏసీల నేతలు రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళితే ఒక నిమిషం సమయం కూడా కేటాయించ లేదు. మర్యాద కోసం అయినా కూర్చోమని చెప్పలేదు. ఉద్యోగులు ప్రభుత్వంలో…
ఏపీలో అమరావతి ఎప్పడూ హాట్ టాపిక్కే. తాజాగా అమరావతిని కార్పోరేషన్ గా చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా రాజధాని గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. అమరావతి కాపిటల్ సిటీ ప్రభుత్వ ప్రతిపాదనకు రైతులు, గ్రామాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కురగల్లు, మందడం, నీరు కొండ ప్రాంతాల్లో రాజధాని గ్రామాలను విలీనం చేస్తున్నామని అధికారులు ప్రతిపాదన పెట్టారు. సీఆర్డీఏ…చట్టాల ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని…కార్పొరేషన్ సిటీకి వ్యతిరేమంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.…
మూడు రాజధానుల చట్టాన్ని తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా.. ఆగిపోయిన భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. నిధుల సమీకరణకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది సీఆర్డీఏ. మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రస్తుతమున్న మూడు చట్టాలను రద్దు చేశామని.. తిరిగి సమగ్రంగా కొత్తగా తీసుకొస్తామని స్పష్టం చేసింది…
ఆయన కేంద్ర మాజీ మంత్రి. అనువంశికంగా వచ్చిన హక్కులను పోరాడి సాధించుకున్నారు. హోదాతోపాటు ఇటీవల ఓ కారు కాంపౌండ్లోకి వచ్చింది. ఆ.. వాహనం ఎక్కాలంటేనే పెద్దాయన తెగ టెన్షన్ పడుతున్నారట. కోరి తెచ్చుకున్న ఆ కారు కష్టాలేంటో ఓ లుక్కేయండి. అశోక్ గజపతిరాజు. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా.. ప్రతి పక్షంలో వున్నప్పుడు సైలెంట్గా వ్యవహరించడం ఆయనకు అలవాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కాంట్రవర్సీకి ఆస్కారం వచ్చిన సందర్భాలు అరుదే. ఇదంతా 2020కి ముందుమాట కాగా ఇప్పుడు అశోక్…