అమరావతిలో నిర్మాణాలపై సీఆర్డీయే ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రాజధానుల చట్టాన్ని తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా.. ఆగిపోయిన భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. నిధుల సమీకరణకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది సీఆర్డీఏ.
మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రస్తుతమున్న మూడు చట్టాలను రద్దు చేశామని.. తిరిగి సమగ్రంగా కొత్తగా తీసుకొస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాగే సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఆర్డీఏ పరిధిలోని చాలా కాలంగా పెండింగులో ఉన్న భవనాల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం ఏమేం భవనాలు పెండింగులో ఉన్నాయి..? అవి ఏయే పరిస్థితుల్లో ఆ బిల్డింగులు ఉన్నాయనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సమాచారం సేకరించింది.
Also Read
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
అయితే వీటిల్లో ప్రాధాన్యతల వారీగా ఆగిపోయిన బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని డిసైడైంది ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే హైకోర్టు అదనపు భవనం నిర్మాణం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన నిర్మాణం కూడా వీలైనంత త్వరగానే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికైతే నిర్మాణ పనులు ప్రారంభం కాకున్నప్పటికీ.. వీలైనంత త్వరగానే నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇప్పటికే విజయవాడ- గుంటూరు పరిధిలో నివాసముంటున్న హెచ్వోడీ, కమిషనర్లు, సెక్రటరీల హోదాల్లోని అఖిలభారత సర్వీసు అధికారులకు 40 వేల చొప్పున అద్దె భత్యాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. విభజన అనంతరం ప్రతీ నెలా ఇది ప్రభుత్వానికి భారంగానూ మారింది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల భవన సముదాయాల నిర్మాణానికి సుమారు 730 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందనే అంచనాతో పనులు ప్రారంభించింది నాటి ప్రభుత్వం. ఈ నిర్మాణాలు దాదాపు 75 శాతం మేర పూర్తి అయినా.. ఇక ఫినిషింగ్, ఇంటిరీయర్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో ఆ రెండు భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నా.. అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కావాలన్నా.. పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయనే అంచనా వేసింది ప్రభుత్వం. దీనికి ఇప్పటికే 3 వేల కోట్ల రూపాయలతో డీపీఆర్ సిద్దం చేసింది సీఆర్డీఏ. ఈ మేరకు నిధుల సమీకరణ చర్యలను ప్రారంభించింది. నిధులు సమకూరితే.. ఓ ఆరేడు నెలల కాలంలో రెండు భవనాలను కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అప్పగించే అవకాశం కన్పిస్తోంది.
తాజావార్తలు
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!