ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా చెరువులు, కుంటలు నిండి కట్టలు తెగిపోతున్నాయి. దీంతో వరద నీరు గ్రామాల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొన్న చోట్ల చెరువులు నిండుకుండాలను తలపిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని ప్రజలు బిక్కబిక్కుమంటూ భయాందోళనలో ఉన్నారు. అనంతరపురం కురిసిన భారీ వర్షాలకు హిందుపురంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హిందుపురం నుంచి అనంతపురం, పెనుకొండ, గోరంట్ల, లేపాక్షి, చిలమత్తారు గ్రామాలకు రాకపోకలు…
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగాయి. వరద నీటితో భగత్సింగ్ కాలనీ జలదిగ్బంధలో చిక్కుకుంది. వెంకటేశ్వరపురంలోని టిడ్కో గృహాలు సైతం నీటితో మునిపోయాయి. పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో పెన్నానది పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. దీంతో బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. బుచ్చిమండంలో మినగల్లు, పెనుబల్లి, కాకులపాడు, దామరమడుగు గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. వీటితో పాటు కోవూరు, ఇందుకూరుపేట, విడవటూరు…
వాయుగుండంతో భారీ వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోని పలు జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కకున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. వరదల్లో రాజంపేట నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పొలపత్తూరు శివాలయంలో దేపారాధనకు వెళ్లి ఎంతమంది చనిపోయింది సమాచారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 మృతదేహాలు గుర్తించారని, మరికొందరు గల్లంతైనట్లు ఆయన తెలిపారు. శివాలయం ఘటనలో 11 నుంచి 12 మంది చనిపోయిండవచ్చని అంచనా వేస్తున్నట్లు…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ తిరుచానూరు, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో వరద తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్థుల భవనం కూలిపోయింది. Also Read:అక్కడికి వెళ్లి ఎంతమంది చనిపోయారో తెలియడం లేదు : వైసీపీ ఎమ్మెల్యే అంతేకాకుండా…
చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురి శాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం. పుదుచ్చేరి చైన్నై మధ్య తీరం దాటిందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. దీనిప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిత్తూరుకు తప్పని…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి రోడ్లపై వరద నీరు వచ్చిచేరుతోంది. అయితే కడప జిల్లా రాజంపేటలోని చెయ్యేరు నది కట్ట తేగిపోవడంతో ఒక్కసారి రోడ్లపై వరద నీరు వచ్చింది. దీంతో రోడ్డుపై ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు ముందుకు కదలలేక వరద నీటిలోనే నిలిచిపోయాయి. వరద నీరు బస్సులోకి చేరడంతో ప్రయానికులు…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని 66 మండలాలో వర్షాలు కురిసాయి. 42 మండలాలో 100 మిల్లిమీటర్లు దాటిన వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పెద్దమండ్యంలో 200 మిల్లిమీటర్లు, అత్యల్పంగా పిచ్చాటురు మండలంలో 35 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే తిరుపతి అర్బన్ లో 100 మిల్లిమీటర్లు, తిరుపతి రూరల్ లో 120 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో కళ్యాణిడ్యాం నిండుకుండలా మారింది.…
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో సచివాలయంలో వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలపై సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయని, ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుతం వాయుగుండం తమిళనాడులో తీరం దాటిందని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు,…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో తన ప్రభావం చూపుతోంది. ఈ రోజు ఉదయం చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటింది. అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా చిత్తూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్లపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Also Read : నిండుకుండలా కళ్యాణి జలాశయం.. పొంగుతున్న చెరువులు ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో వరదనీటిలో నలుగురు…
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అంతేకాకుండా తక్షణ సహాయంగా రూ.1000 వెయ్యి చొప్పున సీఎం జగన్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. భారీ వర్షాలతో కళ్యాణి జలాశయం నిండుకుండాలా మారింది. పూర్తిస్థాయి…