వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో సచివాలయంలో వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలపై సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయని, ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుతం వాయుగుండం తమిళనాడులో తీరం దాటిందని అన్నారు.
ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోందని, చెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు సమాచారం వస్తోందని అన్నారు. ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించామని అధికారులు వెల్లడించారు. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. అయితే తిరుపతిలో భారీ వర్షాల కారణంగా స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్నను నియమించిన సంగతి తెలిసిందే.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఈ నేపథ్యంలో తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో దీని పై తగిన కార్యచరణ సిద్ధం చేయాలన్న సీఎం సూచించారు. అంతేకాకుండా బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్నారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని, ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్న సీఎం జగన్.. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని, రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలని జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!