తీరం దాటిన వాయుగుండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురి శాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం. పుదుచ్చేరి చైన్నై మధ్య తీరం దాటిందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. దీనిప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
చిత్తూరుకు తప్పని వరద ప్రభావం..
ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు, కాలనీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నాయి. అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. తిరుపతిలో ఎప్పుడు లేనంత భీకరంగా వర్షం దంచి కొడుతుంది. ఇవాళకూడా తిరుపతి కాలినడక మార్గాలు మూసివేశారు. చిగురువాడ-కేసీపేట మధ్య కూలిన స్వర్ణముఖి బ్రిడ్జి దీంతో వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు వరదలతో జలవిలయంతో వైకుంఠ క్యూలైన్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. శ్రీవారి మాడవిధులు చెరువులను తలపించాయి. కళ్యాణి డ్యామ్ 3గేట్లు తెరవడంతో స్వర్ణ ముఖి నది భీభత్సం. ఘాట్రోడ్లో 13 చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడు తున్నా రు.
Also Read
భారీ వర్షానికి ఏరాయి ఎప్పుడు విరిగిపడుతుందో తెలియని పరిస్థి తులు నెలకొన్నాయి. రాయలవారి కాలంలో అనేక గుంటలు తవ్విం చారు. ఇప్పుడు వీటిపై నిర్మాణాలు చేపట్టడంతో ఆయా కాలువల నుం చి వచ్చే వరదనీరు రోడ్ల పైకి చేరుతుంది. నారాయణ గిరి గెస్ట్హౌజ్లో కి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఈనీటిలో రాళ్లుకూడా కొట్టుకు వచ్చాయంటే వరద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు . కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ అధికారులు. అలి పిరి, శ్రీవారి మార్గం. కపిల తీర్థం వద్ద పొంగిపోర్లుతున్న వరద దీంతో లోతట్టు ప్రాంతాలన్ని నీట మునుగుతున్నాయి. టీటీడి కంప్యూటర్ రూంలోకి వరదనీరు చేరడంతో సర్వర్లను ఆపివేశారు. టీటీడీ కార్యాలయానికి సెలవు ప్రకటించిన టీటీడి.
గడచిన 50 ఏళ్లలో ఇంతటి వర్షాన్ని ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు. చిత్తూరు వ్యాప్తంగా పొంగిపోర్లుతున్న వాగులు వంకలు, ప్రమాదంలో మరికొన్ని కాలనీలు వరద నీరు పోటెత్తడంతో బుగ్గ వంక 4 గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు. మదనపల్లిలో పొంగి పోర్లు తున్న బహుదా కాలువ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. పశువులు సైతం వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో స్థానికులున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..