ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. అందు కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. కనీసం కాలి నడక అయినా అలవాటు చేసుకోవాలి. రోజువారీ నడక అలవాటు శారీరక శ్రమను పెంచుతుంది. అంతేకాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, మానసిక ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి.
హైదరాబాద్లో ఇటీవల హోటల్స్లో ఆహార పదార్థాల అపరిశుభ్రత, నిల్వ ఉంచిన మాంసం, సరైన నిబంధనలు పాటించకపోవడం, కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో పురుగులు, కీటకాలు కనిపించడం వంటి సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
New Study: జ్ఞాపకశక్తి అనేది కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాకపోయి ఉండొచ్చని కీలక అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ యూనివర్శిటీ (NYU)లోని శాస్త్రవేత్తలు జ్ఞాపకశక్తి పనితీరు మెదడు కణాలకు ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సూచించే పరిశోధనను వెల్లడించారు. శరీరంలో మెదడు కణాలు కానీ చాలా ప్రాంతాల్లో కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటున్నట్లు కనుగొన్నారు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ కొన్ని పండ్లలో ఉండే విత్తనాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పండ్ల గింజల్లో సైనైడ్ అనే విష పదార్ధం తక్కువ మొత్తంలో ఉంటుంది. అది హానికరం కాకపోయినప్పటికీ, ఎక్కువ మొత్తంలో ఈ విత్తనాలను తీసుకోవద్దు.
బరువును కంట్రోల్ చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడిని నియంత్రించాలి. బరువు తగ్గేందుకు జిమ్ లు, వ్యాయమం చేసేంత సమయం లేకపోతే.. కొన్ని కేలరీల బర్నింగ్ కార్యకలాపాలను అనుసరించవచ్చు. వీటి సహాయంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించవచ్చు. జిమ్కి వెళ్లకుండా ఇంట్లోనే మీ బరువును నియంత్రించే శరీర కార్యకలాపాలు ఏమిటో తెలుసుకుందాం..
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. అన్నంలో చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Sugar Intake: ప్రతి సంతోషకరమైన సందర్భంలో చాక్లెట్లు, స్వీట్లు చూపించడం మాకు అలవాటు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇలా చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అప్రమత్తంగా వ్యవహరించకుంటే మధుమేహం బారిన పడతారన్నారు. షుగర్ ఎక్కువగా తీసుకుంటే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు కట్టడి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర మిఠాయిలు ఇవ్వవద్దని…
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా కొందరు మాత్రం అంత త్వరగా మానరు. అయితే.. ప్రస్తుతం యువత టీతో పాటు సిగరెట్ తాగేందుకు ఇష్టపడుతున్నారు. వారు దీన్ని చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే టీ, సిగరెట్ల కలయిక వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల చాలా తీవ్రమైన వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఈ వార్తలో తెలుసుకుందాం...
ప్రతి అందరి ఇళ్ల కిచెన్లో బంగాళదుంపలు (ఆలుగడ్డ) ఖచ్చితంగా ఉంటాయి. బంగాళదుంప కర్రీ నుంచి మొదలు పెడితే.. సాంబారు, పులుసు ఇలా దీనిని వాడేస్తారు. బంగాళాదుంప కర్రీ అంటే కొంత మందికి ఇష్టముంటుంది.. కొంత మందికి ఉండదు. ఏదేమైనాప్పటికీ.. బంగాళదుంపలు ఆహార పదార్థాలలో ఒకటి. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. అయితే ఈ మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల మన ఆరోగ్యంపై చాలా ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి కొన్ని అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఇవి తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపి రోగాల బారిన పడుతున్నారు. ఇంతకీ.. డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన జాబితాలో అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల వచ్చే రోగాల గురించి తెలిపింది.