Curd: పెరుగును ఈ ఆహారాలతో తింటున్నారా.. జర జాగ్రత్త..!
- పెరుగు అంటే చాలా మందికి ఇష్టం
- భోజనం చేసేటప్పుడు పెరుగు కొందరికి తప్పనిసరి
- పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు
- పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది
- పెరుగుతో కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. భోజనం చేసేటప్పుడు చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. మలబద్ధకం నయమవుతుంది. పెరుగు తింటే ఎముకల సాంద్రత పెరిగి ఎముకలు దృఢంగా తయారవుతాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది.. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి.. ఆరోగ్యంగా చేస్తుంది. అంతేకాకుండా.. ముఖంపై ఉన్న మొటిమలు, ముడతలను తొలగించడంలో పెరుగు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా.. బరువు అదుపులో ఉంటుంది. పెరుగులో తక్కువ కేలరీలు ఉంటాయి, ఇది చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.
పెరుగు తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి బీపీని సాధారణీకరిస్తాయి. పెరుగును రోజూ తినడం వల్ల అమృతం వంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే.. కొన్నిసార్లు తినేటప్పుడు పెరుగుతో పాటు ఇతర ఆహారాలను కలిపి తింటారు. అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.. ఇంతకీ ఆ ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం.
Also Read
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
- Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
Bank Jobs: SIDBIలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం
పెరుగుతో ఉల్లిపాయను తినకూడదు:
చాలా తరచుగా ప్రజలు పెరుగు రైతాను తయారు చేస్తారు. అందులో ఉల్లిపాయలు, టమోటాలు కూడా వేస్తారు. కానీ ఉల్లిపాయను పెరుగుతో అస్సలు తినకూడదు. ఉల్లిపాయను పెరుగుతో కలిపి తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. పెరుగు-ఉల్లిపాయల కలయిక అసిడిటీ, వాంతులు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. పెరుగులో రుచి కోసం ఇతర ఆహారాలను తినాలనుకుంటే.. చక్కెర, బెల్లం, తేనె, ఎండుమిర్చి, గరం మసాలా కలపి తినవచ్చు. పెరుగును మజ్జిగ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
పెరుగుతో పండ్లను తినవద్దు:
పెరుగును పండ్లలో కలిపి జ్యూక్స్ తయారు చేస్తారు. అలా చేయడం వల్ల మీ జీర్ణక్రియను పాడు చేస్తుంది. అంతేకాకుండా.. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, అలర్జీ వంటి సమస్యలు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. పెరుగు ఆమ్లంగా ఉంటుంది.. దీనిని పండ్లతో కలిపి తీసుకుంటే.. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, గుండెల్లో మంట వస్తాయి.
చేపలు తిన్న తర్వాత పెరుగు తినొద్దు:
చేపలను తిన్న తర్వాత పెరుగును అస్సలు తినొద్దు. చేపలు, పెరుగులో రెండూ అద్భుతమైన ప్రోటీన్లు ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరానికి విషపూరితం అవుతుంది. అలా ఈ రెండు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.
పెరుగుతో ఖర్జూరాన్ని తినవద్దు:
పెరుగుతో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెరుగు తింటే శరీరం చల్లగా ఉంటుంది. దీంతో.. కఫం, వాతాన్ని పెంచుతుంది. ఖర్జూరం వేడిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇవి రెండు అపోజిట్….
- Tags
- Be careful
- curd
- eat
- Foods
- Health
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!