Health: ఈ సమస్యలు ఉన్న వాళ్లు జామపండు తినొద్దు.. దూరంగా ఉంటే మంచిది
- జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది
- ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
- జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
- జామలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం కొందరికి జామ పండ్లు తింటే సైడ్ ఎఫెక్ట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఏంటాయి. జామపండు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. జామపండ్లు అందరూ తినలేరు. వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
Madras High Court: ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం..
Also Read
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ఈ సమస్యలు ఉన్న వాళ్లు తినకండి:
అసిడిటీ సమస్య:
కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య ఉంటే జామపండుకు దూరంగా ఉండాలి. జామపండులో ఉండే యాసిడ్, ఫైబర్ కడుపులో ఎసిడిటీని పెంచి.. మంటను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దీన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
మలబద్ధకం రోగులు:
జామలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే దీని గింజలను నమిలి తింటే మలబద్ధకం సమస్య పెరుగుతుంది. జామ గింజలు పేగులకు అంటుకుని జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు:
కిడ్నీ సంబంధిత సమస్యల విషయంలో జామ పండు తీసుకోవడం తగ్గించాలి. జామపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి.
డయాబెటిక్ పేషెంట్లు:
జామపండులోని తీపి సహజమే.. జామ పండు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. చక్కెర లెవల్స్ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
జలుబు, దగ్గు సమస్య ఉన్నవాళ్లు:
జామకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని తింటే జలుబు, దగ్గు సమస్య పెరుగుతుంది. తరచుగా జలుబుతో బాధపడేవారు జామపండ్లను తినకూడదు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?