కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల్లో అత్యధిక భాగం సంపన్న దేశాలు తమ వద్ద అట్టిపెట్టుకోవడం వల్ల పేద దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పదే పదే చెబుతూ వస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తాజాగా మరో హెచ్చరిక చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ అక్రమ నిల్వలను అరికట్టకపోతే ఒమిక్రాన్ను ఎదుర్కొవడం అసాధ్యమని చెప్పింది. వ్యాక్సినేషన్పై సమావేశమైన డబ్ల్యుహెచ్ఓ నిపుణుల కమిటీ సంపన్న దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసుల కోసం పెద్దఎత్తున వ్యాక్సిన్లను అంటిపెట్టేసుకున్నాయని, ఈ అదనపు నిల్వలను…
ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో మరోసారి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా.. బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి పలు దేశాలు. ఇండియాలో కూడా బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్…
కరోనా వైరస్తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరింయట్తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ ఏపీలో లేకపోవడంతో ఫలితాల నిర్ధారణ కోసం హైద్రాబాద్కు పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే వారంలో రాష్ర్టంలోనే ఈల్యాబ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ…
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్స్లో 155 ICU బెడ్స్ అందుబాటులో…
ఓ వైపు కోవిడ్ మహమ్మారితో యుద్ధం చేస్తుంటే మరో వైపు ఇతర వ్యాధుల పెరుగుదల, మరణాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా తెలంగాణపై క్యాన్సర్ పంజా విసురుతోంది. ప్రతీ ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎంతగా పెరుగుతోందంటే గత 30 ఏళ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. 1990లో ఉమ్మడి ఏపీలో ఒక లక్షమంది జనాభాకు 54 క్యాన్సర్ రోగులు…
తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు 1000 మంది వచ్చారు. వీరందరిని టెస్టులు చేశామని వైద్యాఆరోగ్య శాఖ చెప్పింది. ఇందులో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఒమిక్రాన్ వేరింయట్ కాదా అనేది నిర్ధారించేందుకు జీనోమ్ స్వీకెన్సీంగ్ ల్యాబ్కు పంపించామని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని తెలిపారు. కోవిడ్ను రాష్ర్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హెల్త్ డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు. కరోనా కేసులను దాచిపెడుతున్నామన్న…
ప్రపంచంలో ఏ అమ్మాయైనా తాను అందంగా ఉండాలని కోరుకొంటుంది. దానికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. క్రీములని, అవని, ఇవని వాడుతూనే ఉంటారు.. ఇంకొందరు న్యాచురల్ గా అందంగా మారడానికి ముల్తాన్ మట్టి, పసుపు, మంచి నీరు ఎక్కువగా తాగడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికి తెలిసినవే.. అయితే దక్షిణ కొరియాలోని అమ్మాయిలు మాత్రం తమ అందాన్ని పెంచుకోవడానికి ఒక థెరపీని ఫాలో అవుతారంట.. అందుకే తాము అంత అందంగా ఉంటామని చెప్పుకొస్తున్నారు.. దక్షిణ కొరియాలో అమ్మాయిలు…
దేశవ్యాప్తంగా మహమ్మారి టీబీ అదుపులో వున్నా.. డెంగ్యూ మాత్రం తన ప్రతాపం చూపుతూనే వుంది. కేంద్రం టీబీ, డెంగ్యూలకు వ్యాక్సిన్ల ను తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు…
కివీ పళ్ళు ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో బాగా తీసుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. రెండు కివీ పళ్ళను స్నాక్ గా తీసుకుంటే కడుపు నింపుతాయి. వీటిలో 58 కేలరీలే వుంటాయి. సాయంత్రం ఏదైనా తినాలని భావించేవారికి కివీ పళ్ళు చక్కని ఛాయిస్. కివీ పళ్ళు జీర్ణ క్రియకు బాగా సాయం చేస్తాయి, స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.గతంలో విదేశాల్లోనే…