ఇప్పటికే కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ ఒమిక్రాన్, డెల్టా వేరింయంట్ల రూపంలో టెన్షన్ పెడుతుంటే మరోవైపు తెలంగాణలో కొత్త వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్ర్కబ్ టైఫస్ అనే వ్యాధి బారిన పడ్డవారు ఏకంగా 15మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రుల్లో చేరారని ఇప్పటికే ఇద్దరికి వ్యాధి నయమైందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారుల్లో కనిపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధికి సంబంధించి…
ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ర్టంలో కేసులు నమోదు అవ్వగా తాజాగా తెలంగాణలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్నగర్లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది. హయత్నగర్కు చెందిన యువకుడు ఇటీవలే సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఒమిక్రాన్ సోకిన యువకుడిని అధికారులు గచ్చిబౌలి టిమ్స్కు తరలించారు. ఈ యువకుడి…
కరోనా సాధారణ ప్రజల జీవితాలను అస్త్యవస్తం చేసింది. కరోనా వచ్చి ఏడాది అవుతున్నా ఈ మాయాదారి మహమ్మారి ఇప్పటికి తన రూపురేఖలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా, బూస్టర్ డోసులు వేసుకున్నా ఎవ్వరేమి తక్కువ కాదు నాకు అందరూ ఒక్కటే అంటూ విరుచుకు పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా వెళ్లాయి. మరికొన్ని…
ఒమిక్రాన్తో దేశం అంతట ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం 100శాతం వ్యాక్సినేషన్ అధికారులు ఇవ్వగలిగారు. దీంతో సంపూర్ణ వ్యాక్సినేషన్ సాధించిన ప్రాంతంగా ఈ దీవి రికార్డు సృష్టించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో కొండలు, అడవులు దాటి వెళ్లి వ్యాక్సినేషన్ వేయడమంటే పెద్ద సవాల్తో కూడుకున్న పనిగా అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రపాలిత ప్రాంతంలో అర్హులందరికీ రెండు డోసుల…
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరింయట్పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సారి కనుక ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగి ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేశ ప్రభుత్వాలదేనని తెలిపింది. కరోనా కొత్త వేరింయట్ ఒమిక్రాన్ ఇప్పటి వరకు 89 దేశాలకు వ్యాపించినట్లు who తెలిపింది. ఈ వేరియంట్ సోకిన ప్రాంతాల్లో కేసులు, రెండు మూడు రోజుల్లోనే రెట్టింపు…
భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న సంగతి తెల్సిందే. వ్యాక్సినేషన్లో భారత్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో సగానికి పైగా మందికి రెండు డోసుల వ్యాక్సిన్ను అందజేశారు. IANS-Cvoter కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ సర్వే ప్రకారం.. జనాభాలో 98శాతం కంటే ఎక్కువ మంది కరోనా వైరస్కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. దేశంలోని 90 కోట్ల మంది వయోజన జనాభాలో 81 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్ 19…
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అన్ని దేశాలు బూస్టర్ డోస్ పై చర్చను ప్రారంభించాయి. అభివృద్ధి చెందిన దేశాలలో బూస్టర్ డోస్ను వారి ప్రజలకు ఇస్తున్నాయి. అయితే దీనిపై డబ్ల్యూహెచ్ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. బూస్టర్ డోస్ల పేరుతో వ్యాక్సిన్ నిల్వలను అంటిపెట్టుకోవద్దని వాటి పేద దేశాలకు అందజేయాలని సూచించింది. అయితే మనదేశంలో బూస్టర్ డోస్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్కు వెల్లడించినట్లు…
కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల్లో అత్యధిక భాగం సంపన్న దేశాలు తమ వద్ద అట్టిపెట్టుకోవడం వల్ల పేద దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పదే పదే చెబుతూ వస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తాజాగా మరో హెచ్చరిక చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ అక్రమ నిల్వలను అరికట్టకపోతే ఒమిక్రాన్ను ఎదుర్కొవడం అసాధ్యమని చెప్పింది. వ్యాక్సినేషన్పై సమావేశమైన డబ్ల్యుహెచ్ఓ నిపుణుల కమిటీ సంపన్న దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసుల కోసం పెద్దఎత్తున వ్యాక్సిన్లను అంటిపెట్టేసుకున్నాయని, ఈ అదనపు నిల్వలను…
ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో మరోసారి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా.. బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి పలు దేశాలు. ఇండియాలో కూడా బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్…
కరోనా వైరస్తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరింయట్తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ ఏపీలో లేకపోవడంతో ఫలితాల నిర్ధారణ కోసం హైద్రాబాద్కు పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే వారంలో రాష్ర్టంలోనే ఈల్యాబ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ…