దేశంలో రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారత్లో ఇప్పటికే 245 కేసులకుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి తీవ్రత మాత్రం పది రాష్ట్రాల్లోనే ఉండటంతో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి కేసులను అధ్యయనం చేయడంతో పాటు ఒమిక్రాన్ కేసుల రోజువారి నమోదు, కోవిడ్నిబంధనల అమలు వంటి వాటిపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వరకు జరిగిందనే విషయాలను సైతం పరిశీలిస్తుంది. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేరళ, మహారాష్ర్ట, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లలో ఈ బృందం పర్యటించి తీసుకోవాల్సిన చర్యలు గురించి రాష్ర్ట ప్రభుత్వాలకు వివరిస్తుంది. అంతే కాకుండా ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వనుంది.