MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ ఇచ్చింది జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (JSHB). స్థలం విషయంలో ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్ H-(10)A ని కేటాయించింది. అయితే ఈ స్థలాన్ని కేవలం ‘నివాస అవసరాల’ (Residential Use) కోసం మాత్రమే కేటాయించారు. కానీ ప్రస్తుతం అక్కడ ఒక డయాగ్నస్టిక్ సెంటర్ (నీబర్గ్ పల్స్ డయాగ్నస్టిక్స్) నడుస్తోంది. అంటే ఆ ప్లాట్ ను ‘వాణిజ్య అవసరాల’ (Commercial Use) కోసం వాడుతున్నారని బోర్డు గుర్తించింది. ఇది కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించడమేనని బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
ఈ నోటీసుపై స్పందించేందుకు ధోనీకి బోర్డు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలపరిమితిలోగా సరైన వివరణ ఇవ్వకపోతే.. ఆ ప్లాట్ కేటాయింపును రద్దు చేయాలని బోర్డు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఇలా కేవలం ధోనీకే కాకుండా.. ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు జార్ఖండ్ హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు సంజయ్ లాల్ పాశ్వాన్ ధృవీకరించారు.
హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు చాలా ప్రత్యేకం. ఇంటి గోడలపై ఆయన పేరు, జెర్సీ నంబర్ 7, ఫేమస్ హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్తో కూడిన చిత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దీనిని ఒక సెల్ఫీ పాయింట్లా చూస్తారు. అయితే ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి రాంచీలోని సిమాలియా రింగ్ రోడ్ లో ఉన్న భారీ ఫామ్హౌస్ లో నివసిస్తున్నారు. హర్ములోని ఆస్తి ప్రస్తుతం ఆయన పాత నివాసంగా మాత్రమే ఉంది.
Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
ప్రస్తుతం ధోనీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు చివరి ఐపీఎల్ కావచ్చు అని ప్రచారం జరుగుతోంది. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన ఆటతో క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..