Turkey: టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని…
Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.
Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
USA: ఇరాన్ లోని హమాస్ అధికారి, ఇరాన్ లోని రివల్యూషనరీ గార్డ్ సభ్యులతో సహా ఇటీవల ఇజ్రాయిల్ పై దాడికి తెగబడిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్పై అమెరికా రెండో రౌండ్ ఆంక్షలు విధించింది.
Israel Palestine Attack: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు విధ్వంసకరంగా మారుతోంది. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 6500 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడం వల్ల పౌరుల మరణాల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ కుటుంబం మొత్తం చనిపోయారు.
Tayyip Erdogan: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది అమయాకు ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారు. ఈ దాడి ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ మధ్య తీవ్ర యుద్ధానికి కారణంమైమది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది.
Israel Hamas War: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది. విచక్షణారహితముగా ఇజ్రాయిల్ పైన విరుచుకుపడింది. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్దానికి కారణం అయ్యాయి. మొదట్లో ఇజ్రాయిల్ పైన హమాస్ పైచెయ్యి సాధించిన రానురాను ఇజ్రాయిల్ దాడికి హమాస్ వణికిపోతుంది. వివారాలలోకి వెళ్తే .. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 704 మంది పౌరులు మరణించారని వీరిలో 305 మంది…
Hamas-Israel war: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో 1400 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులను హమాస్ బంధించింది. హమాస్ విచక్షణారహితంగా మానవత్వం మచ్చుకైనా లేని విధంగా ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. చిన్న పెద్ద తేడాలేకుండా కనిపించినవాళ్ళని కనిపించినట్టు చంపేసింది. హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వానికి సాక్ష్యంగా వాళ్ళు చేసిన అకృత్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోని…
ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ద జ్వాలలు నేటికీ ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 5500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా మరోసారి , గాజా పైన ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్కు చెందిన మరో కీలక అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఇజ్రాయిల్ హమాస్ పైన చేస్తున్న ప్రతీకార దాడుల్లో హమాస్లో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు హతమయ్యారు. ఆదివారం గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్…