Turkey: “వెంటనే ఆ పిచ్చిని ఆపేయండి”.. ఇజ్రాయిల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey: టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని ఎర్డోగాన్ ఎక్స్(ట్విట్టర్)లో వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ వెంటనే ఈ ‘మ్యాడ్ నెస్’ని ఆపేయాలని, దాడులను ముగించాలని కోరారు. ఎర్డోగాన్ శనివారం ఇస్తాంబుల్ లో పాలస్తీనాకు మద్దతుగా తన పార్టీ ఇస్లామో-కన్సర్వేటివ్ ఏకేపీ పార్టీ నిర్వహించనున్న ర్యాలీని ప్రోత్సహించాడు. ఈ ర్యాలీకి దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉంటాని ఎర్డోగాన్ ప్రకటించారు.
Also Read
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
Read Also: Yogesh Kadyan: పెన్ను పట్టుకోవాల్సిన వయసులో గన్ను పట్టుకున్నాడు .. 19 ఏళ్లకే రెడ్ కార్నర్ నోటీసులు
రెండున్నర దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న ఎర్డోగాన్ పలుమార్లు పాలస్తీనాకు మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో మొదటిసారిగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో మరోసారి పాలస్తీనా స్టాండ్ తీసుకున్నారు. హమాస్ నాయకులు ఉగ్రవాదులు కాదని, తమ భూమి కోసం పోరాడుతున్న విముక్తి పోరాట యోధులుగా అభివర్ణించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించగా.. 229 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు బంధించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజాపై జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 7000కు పైగా ప్రజలు మరణించారు. ఇందులో 3000 మంది పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..