వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావొచ్చాయి.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి..
సికింద్రాబాద్ రైల్వే ఘటనలో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ అల్లర్ల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో వున్న ఆవుల సుబ్బారావు నోరువిప్పాడు. తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో.. విద్యార్థులను రెచ్చగొట్టించినట్టు తేలింది. ఆందోళనలు చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో అనుచరులు పిలుపునిచ్చారు. గుంటూరు ర్యాలీ…
మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం కేడర్కు అర్థం కావడం లేదట. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బంది పడ్డారు.…
వివాహ సంబంధాలు ప్రాణాలు తీసుకునే పరిస్థిలకు దారి తీస్తున్నాయి. వారితో పాటు వారికి పుట్టిన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని వారితో పాటే ఆ చిన్నారుల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు తల్లిదండ్రులు. కుటుంబ కలహాలో.. లేక భార్య భర్తల మధ్య గొడవలు, అత్త, మామ, ఆడపడుచుల వేధింపులో.. లేక ఒకరిపై ఇంకొరి వాదనలతో వివాహేతర సంబందాలకు దూరమై ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అయితే ఓతల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ.. పట్టాలు దాటుతుందో ఏమో తెలియదు…
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు. అయితే.. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి దోపిడి జరుగుతుందని ఆరోపిస్తూ నేడు చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల నరేంద్ర పిలపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టుగా చెప్పారు. అనుమర్లపూడిలో నిరసనలకు అనుమతి…