Gotabaya Rajapaksa: సింగపూర్ నుంచి థాయ్లాండ్కు శ్రీలంక మాజీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి టూరిస్ట్ వీసాపై సింగపూర్ లోనే ఉంటున్నాడు గోటబయ రాజపక్స.
అయితే తాజాగా థాయ్లాండ్కు వెళ్లాడు. తాత్కాలికంగా కొన్ని రోజులు ఆశ్రయం కోరినట్లు తెలిసింది. రాజపక్స థాయ్లాండ్ లో రాజకీయ ఆశ్రయం కోరలేదని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే గోటబయ రాజపక్స థాయ్లాండ్ వస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని థాయ్లాండ్కు ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా కూడా ధ్రువీకరించారు. గురువారం రాజపక్స బ్యాంకాంక్ చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. థాయ్లాండ్ లో ఉన్నంత కాలం రాజపక్స ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరని ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
Also Read
- Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
READ ALSO: Anand Mahindra: బాలుడి స్టంట్స్కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
థాయ్లాండ్ విదేశాంగ మంత్రి డాన్ ప్రముద్వినై మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం గోటబయ రాజపక్స థాయ్లాండ్ లో ఉండేందుకు మద్దతు ఇస్తోందని.. థాయ్లాండ్కు రాజపక్సకు 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పించిందని తెలిపారు. గోటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోయి కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే అధికార బాధ్యతలు చేపట్టిన శ్రీలంకలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇప్పటికీ ప్రజల కష్టాలు అలానే ఉన్నాయి. నిత్యావసరాల కోసం, పెట్రోల్ కోసం క్యూలు కడుతున్నారు. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలపై అక్కడి ప్రభుత్వం కరెంట్ ఛార్జీల రూపంలో మరింత భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం కరెంట్ ఛార్జీలు పెంచింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు.
తాజావార్తలు
-
Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు… ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
-
KTM India: జూన్ 1 నుంచి KTM బైక్స్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఏయే మోడళ్లపై ఎఫెక్ట్ అంటే?
-
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్పై విమర్శలు..
-
Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్మార్క్ అంటూ కామెంట్స్!
-
DK Shivakumar: గవర్నర్ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..