Gotabaya Rajapaksa: సింగపూర్ నుంచి థాయ్లాండ్కు శ్రీలంక మాజీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి టూరిస్ట్ వీసాపై సింగపూర్ లోనే ఉంటున్నాడు గోటబయ రాజపక్స.
అయితే తాజాగా థాయ్లాండ్కు వెళ్లాడు. తాత్కాలికంగా కొన్ని రోజులు ఆశ్రయం కోరినట్లు తెలిసింది. రాజపక్స థాయ్లాండ్ లో రాజకీయ ఆశ్రయం కోరలేదని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే గోటబయ రాజపక్స థాయ్లాండ్ వస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని థాయ్లాండ్కు ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా కూడా ధ్రువీకరించారు. గురువారం రాజపక్స బ్యాంకాంక్ చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. థాయ్లాండ్ లో ఉన్నంత కాలం రాజపక్స ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరని ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
READ ALSO: Anand Mahindra: బాలుడి స్టంట్స్కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
థాయ్లాండ్ విదేశాంగ మంత్రి డాన్ ప్రముద్వినై మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం గోటబయ రాజపక్స థాయ్లాండ్ లో ఉండేందుకు మద్దతు ఇస్తోందని.. థాయ్లాండ్కు రాజపక్సకు 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పించిందని తెలిపారు. గోటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోయి కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే అధికార బాధ్యతలు చేపట్టిన శ్రీలంకలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇప్పటికీ ప్రజల కష్టాలు అలానే ఉన్నాయి. నిత్యావసరాల కోసం, పెట్రోల్ కోసం క్యూలు కడుతున్నారు. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలపై అక్కడి ప్రభుత్వం కరెంట్ ఛార్జీల రూపంలో మరింత భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం కరెంట్ ఛార్జీలు పెంచింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!