Srilkana: శ్రీలంకలో నిరసనలకు తెర.. 4నెలల తర్వాత కీలక పరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilkana: తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురైంది అక్కడి ప్రభుత్వం. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం వల్ల అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఉన్న తమ నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్శిటీ విద్యార్థులు, వామపక్ష పార్టీల నేతృత్వంలోని బృందం రాజధానిలోని గాల్ ఫేస్ సముద్రతీర ప్రామినేడ్లో తమ గుడారాలను తొలగిస్తున్నట్లు తెలిపారు.స్థానిక హోటళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, టెంట్లను తొలగించాలని పోలీసులు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన 4 పిటిషన్లను సైతం ఉపసంహరించుకుంటున్నట్లు నిరసనకారుల ప్రతినిధి తెలిపారు. కార్యకర్తలు తమ టెంట్లను తొలగించడం, వారు వేసిన ఇతర నిర్మాణాలను తొలగించడం వంటి వీడియోలు బయటకు వచ్చాయి.
PM Narendra Modi: చేతబడిని నమ్మేవారు ప్రజల విశ్వాసాన్ని పొందలేరు.. కాంగ్రెస్పై ప్రధాని విమర్శలు
Also Read
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
శ్రీలంక యొక్క అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో ఇంధనం, ఆహారం, మందులు వంటి నిత్యావసరాల కొరతకు నిరసనగా ఏప్రిల్ 9న ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. జూలై 9న పదివేల మంది కొలంబోలోకి ప్రవేశించి గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని ఆక్రమించడంతో ఆయన పారిపోయి చివరికి రాజీనామా చేయవలసి వచ్చింది. రాజపక్స సింగపూర్కు పారిపోయి తన రాజీనామాను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, ప్యాలెస్తో పాటు ప్రధానమంత్రి ఇల్లు, కార్యాలయాన్ని ఆక్రమించిన నిరసనకారులను సైనికులు తరిమికొట్టారు. పోలీసుల దాడుల్లో సుమారు 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అంతర్జాతీయంగా వచ్చిన వ్యతిరేకతతో వాణిజ్యం సంఘం అగ్రనేత జోసెఫ్ స్టాలిన్ను గత సోమవారం విడుదల చేశారు. మరోవైపు.. గొటబాయ రాజపక్స వారసుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమ సింఘే. దేశంలో మళ్లీ నిరసనలు జరగకుండా అత్యవసర పరిస్థితి విధించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన వెంటనే వారు స్విమ్మింగ్ పూల్లో ఉల్లాసంగా ఈతలు కొడుతూ.. ఆ భవనంలోని బెడ్లపై పడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో పాటు నిరసనకారులకు ఒక గదిలో దొరికిన 17.5 మిలియన్ రూపాయల ($46,000) నగదును అధికారులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!