Pana Devi : బికనీర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఇలాంటి అద్భుతం చేసింది. దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. బికనీర్లోని నోఖా తహసీల్లోని అంఖిసర్ గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల గ్రామీణ మహిళ పనా దేవి గోదారా మూడు బంగారు పతకాలను గెలుచుకుంది.
నంద్యాల: కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ అనే యువకుడు చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజి కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అంతేకాదు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఇది వింటుంటే మీకు స్టూడెంట్ నెం.1 మూవీ గుర్తోస్తుంది కదా. అచ్చం రీల్ కథను రీయల్ చేసి చూపించాడు నంద్యాలకు చెందని మహమ్మద్ రఫీ. కాగా స్టూడెంట్ నెం.1లో హత్య కేసులో జైలుకు…
ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు.
ఆసియా క్రీడల్లో మెన్స్ టీమిండియా స్వర్ణం సాధించింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ పూర్తి కాలేదు. దీంతో ఎక్కువ ర్యాంకింగ్ కారణంగా భారత్ను విజేతగా ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు ఖాతాలో మరో స్వర్ణం చేరింది.
ఆసియా క్రీడల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఆసియా క్రీడల్లో 14వ రోజు కూడా భారత్ పతకాల పరంపరను కొనసాగించింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్కు చెందిన సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది.
ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో జపాన్పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో హాకీ జట్టు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది.
India Wins 83 Medals in Asian Games 2023: ఆసియా గేమ్స్లో భారత్కు మరో స్వర్ణం లభించింది. స్క్వాష్లో భారత మిక్స్డ్ డబుల్స్ ద్వయం దీపికా పల్లికల్-హరిందర్ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించారు. మలేషియాకు చెందిన ఐఫా బింటి అజ్మాన్ మరియు సయాఫిక్ కమల్ల జోడీని 11-10, 11-10 తేడాతో ఓడించారు. స్క్వాష్లో భారత్కు ఇది నాలుగో పతకం. పురుషుల జట్టు పాకిస్థాన్ను ఓడించి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. మహిళల జట్టు, మిక్స్డ్…
ఆసియా గేమ్స్ లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చూపిస్తున్నారు. ఇప్పటికే 17 బంగారు పతకాలను సాధించగా.. భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. దీంతో భారత్ 18 బంగారు పతకాలు సాధించింది. జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాను మరోసారి అద్భుత ప్రదర్శన చేసి.. టీమిండియాకు బంగారు పతకాన్ని అందించాడు.
India Wins First Medal in Golf: ఆసియా గేమ్స్ 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్లో మరో స్వర్ణ పతకం వచ్చింది. ఎనిమిదో రోజైన ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్లతో కూడిన భారత పురుషుల జట్టు పసిడిని కైవసం చేసుకుంది. కువైట్, చైనాల నుంచి ఎదురైన పోటీని తట్టుకోగలిగిన భారత్ పోడియంపై అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పురుషుల ట్రాప్ టీమ్ 361 పాయింట్లు…
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో భారత్కు చెందిన అభయ్సింగ్ పాకిస్థాన్కు చెందిన జమాన్ నూర్పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.