Telangana : సీఎంల భేటీ.. తెలంగాణ 10 ప్రతిపాదనలు ఇవే..
- పది ప్రతిపాదనలు ఇచ్చిన తెలంగాణ
- అన్నింటికీ ఒప్పుకోవాలన్న రేవంత్ రెడ్డి
- బనకచర్లపై ఏం తేలుస్తారో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ మీటింగ్ లో ఏపీ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. తెలంగాణ మాత్రం పది అంశాలను ప్రతిపాదించింది. ఇందులో చూసుకుంటే 1.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి. 2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి. 3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ లో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఏపీ సహకరించాలి. అలాగే కృష్ణ ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలకు మద్దతుగా ఏపీని కేంద్రం ఒప్పించాలి.
Read Also : Ap- Telangana : మొదలైన తెలంగాణ, ఏపీ సీఎంల మీటింగ్..
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
4. కృష్ణానది జలాలను వేరే బేసిన్ కు తరలించకుండా “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. దీంతో పాటు కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ఒప్పుకోవాలి. 5.తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి. 6.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు పునరుద్ధరణ జరపాలి. ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి. 7. శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి. 8. శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి. 9.శ్రీశైలం డ్యాం సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి.
10.అక్రమంగా శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది దీనిని అడ్డుకోవాలి. 11. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపునకు తెలంగాణ సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి. ”ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి” ప్రాజెక్టుకు ఏఐబిపి కింద నిధులు ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలి అంటూ ఈ సమావేశంలో తెలంగాణ ప్రతిపాదనలు పెట్టింది. వీటిపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి.
Read Also : RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ పై కేసు..
తాజావార్తలు
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?