Iran-China: హార్ముజ్ను తెరిచి ఉంచండి.. ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
- యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలపై భయాందోళనలు
- హార్ముజ్లో నిలిచిపోయిన 700 ట్యాంకర్లు
- హార్ముజ్ను తెరిచి ఉంచండి
- ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో చమురు ట్యాంక్లన్నీ నిలిచిపోయాయి. అంతేకాకుండా వాటిపై ఇరాన్ దాడులకు కూడా తెగబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. అన్ని దేశాల్లో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చమురు నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో గ్యాప్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు అల్లాడిపోతున్నారు. అలాగే భారత్లో కూడా ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Nitish kumar: నితీష్ కుమార్ బిగ్ ప్లాన్.. కుమారుడికి ‘పెద్ద’ పదవి!
Also Read
- US-Iran War: "ట్రంప్పై నమ్మకం లేదు".. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరాన్ను బీజింగ్ ఒత్తిడి చేస్తోందని చైనా గ్యాస్ కొనుగోలుదారులు చెబుతున్నారు. ఖతార్ గ్యాస్ ఎగుమతులు, అలాగే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇతర ఇంధన రవాణాకు అంతరాయం కలిగించే చర్యలను తక్షణమే నివారించాలని ఇరాన్ అధికారులపై చైనా ఒత్తిడి తెస్తోందని సీనియర్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్కు డ్రాగన్ మద్దతు
ప్రస్తుతం హోర్ముజ్ మార్గంలో 700లకు పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఇరాన్ జరిపిన దాడితో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రపంచంలోని అతిపెద్ద LNG ఎగుమతి సౌకర్యం అయిన రాస్ లఫాన్లో ఖతార్ ఉత్పత్తిని నిలిపివేసింది. అత్యధికంగా చమురు నౌకలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపించనుంది.
ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఎల్పీజీ నిల్వలు రెండు వారాలు మాత్రమే సరిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్పై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!