Iran-China: హార్ముజ్ను తెరిచి ఉంచండి.. ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
- యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలపై భయాందోళనలు
- హార్ముజ్లో నిలిచిపోయిన 700 ట్యాంకర్లు
- హార్ముజ్ను తెరిచి ఉంచండి
- ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో చమురు ట్యాంక్లన్నీ నిలిచిపోయాయి. అంతేకాకుండా వాటిపై ఇరాన్ దాడులకు కూడా తెగబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. అన్ని దేశాల్లో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చమురు నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో గ్యాప్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు అల్లాడిపోతున్నారు. అలాగే భారత్లో కూడా ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Nitish kumar: నితీష్ కుమార్ బిగ్ ప్లాన్.. కుమారుడికి ‘పెద్ద’ పదవి!
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరాన్ను బీజింగ్ ఒత్తిడి చేస్తోందని చైనా గ్యాస్ కొనుగోలుదారులు చెబుతున్నారు. ఖతార్ గ్యాస్ ఎగుమతులు, అలాగే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇతర ఇంధన రవాణాకు అంతరాయం కలిగించే చర్యలను తక్షణమే నివారించాలని ఇరాన్ అధికారులపై చైనా ఒత్తిడి తెస్తోందని సీనియర్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్కు డ్రాగన్ మద్దతు
ప్రస్తుతం హోర్ముజ్ మార్గంలో 700లకు పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఇరాన్ జరిపిన దాడితో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రపంచంలోని అతిపెద్ద LNG ఎగుమతి సౌకర్యం అయిన రాస్ లఫాన్లో ఖతార్ ఉత్పత్తిని నిలిపివేసింది. అత్యధికంగా చమురు నౌకలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపించనుంది.
ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఎల్పీజీ నిల్వలు రెండు వారాలు మాత్రమే సరిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్పై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!