Iran-China: హార్ముజ్ను తెరిచి ఉంచండి.. ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
- యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలపై భయాందోళనలు
- హార్ముజ్లో నిలిచిపోయిన 700 ట్యాంకర్లు
- హార్ముజ్ను తెరిచి ఉంచండి
- ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో చమురు ట్యాంక్లన్నీ నిలిచిపోయాయి. అంతేకాకుండా వాటిపై ఇరాన్ దాడులకు కూడా తెగబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. అన్ని దేశాల్లో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చమురు నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో గ్యాప్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు అల్లాడిపోతున్నారు. అలాగే భారత్లో కూడా ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Nitish kumar: నితీష్ కుమార్ బిగ్ ప్లాన్.. కుమారుడికి ‘పెద్ద’ పదవి!
Also Read
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరాన్ను బీజింగ్ ఒత్తిడి చేస్తోందని చైనా గ్యాస్ కొనుగోలుదారులు చెబుతున్నారు. ఖతార్ గ్యాస్ ఎగుమతులు, అలాగే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇతర ఇంధన రవాణాకు అంతరాయం కలిగించే చర్యలను తక్షణమే నివారించాలని ఇరాన్ అధికారులపై చైనా ఒత్తిడి తెస్తోందని సీనియర్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్కు డ్రాగన్ మద్దతు
ప్రస్తుతం హోర్ముజ్ మార్గంలో 700లకు పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఇరాన్ జరిపిన దాడితో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రపంచంలోని అతిపెద్ద LNG ఎగుమతి సౌకర్యం అయిన రాస్ లఫాన్లో ఖతార్ ఉత్పత్తిని నిలిపివేసింది. అత్యధికంగా చమురు నౌకలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపించనుంది.
ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఎల్పీజీ నిల్వలు రెండు వారాలు మాత్రమే సరిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్పై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!