Iran-China: హార్ముజ్ను తెరిచి ఉంచండి.. ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
- యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలపై భయాందోళనలు
- హార్ముజ్లో నిలిచిపోయిన 700 ట్యాంకర్లు
- హార్ముజ్ను తెరిచి ఉంచండి
- ఇరాన్పై చైనా తీవ్ర ఒత్తిడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో చమురు ట్యాంక్లన్నీ నిలిచిపోయాయి. అంతేకాకుండా వాటిపై ఇరాన్ దాడులకు కూడా తెగబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. అన్ని దేశాల్లో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చమురు నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో గ్యాప్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు అల్లాడిపోతున్నారు. అలాగే భారత్లో కూడా ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Nitish kumar: నితీష్ కుమార్ బిగ్ ప్లాన్.. కుమారుడికి ‘పెద్ద’ పదవి!
Also Read
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరాన్ను బీజింగ్ ఒత్తిడి చేస్తోందని చైనా గ్యాస్ కొనుగోలుదారులు చెబుతున్నారు. ఖతార్ గ్యాస్ ఎగుమతులు, అలాగే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇతర ఇంధన రవాణాకు అంతరాయం కలిగించే చర్యలను తక్షణమే నివారించాలని ఇరాన్ అధికారులపై చైనా ఒత్తిడి తెస్తోందని సీనియర్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్కు డ్రాగన్ మద్దతు
ప్రస్తుతం హోర్ముజ్ మార్గంలో 700లకు పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఇరాన్ జరిపిన దాడితో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రపంచంలోని అతిపెద్ద LNG ఎగుమతి సౌకర్యం అయిన రాస్ లఫాన్లో ఖతార్ ఉత్పత్తిని నిలిపివేసింది. అత్యధికంగా చమురు నౌకలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపించనుంది.
ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఎల్పీజీ నిల్వలు రెండు వారాలు మాత్రమే సరిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్పై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!