Off The Record : జీహెచ్ఎంసీ విభజన తీరుపై బీజేపీ ఫైర్
- జీహెచ్ఎంసీ విభజన తీరుపై బీజేపీ ఫైర్
- శాస్త్రీయత లేకుండా అడ్డగోలుగా చేశారంటూ మండిపాటు
- విభజన వెనక కుట్ర ఉందని ఆరోపణ
- ఎంఐఎంకు లబ్ది చేకూర్చేలా విభజన జరిగిందంటూ లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ను మూడుగా విభజించడం వెనక పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఉన్నాయా? ఆ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎందుకు మండిపడుతోంది? ఇవిగో…. ఇవీ… మీ ఉద్దేశ్యాలంటూ వేటిని ఎత్తి చూపుతోంది కాషాయ దళం? మూడు చోట్ల తమ బలం విషయంలో ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్ను మూడుగా పునర్విభజన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 300 వార్డ్లు, మూడు కార్పొరేషన్స్గా రూపు మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను కొనసాగిస్తూనే…. సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్స్ కొత్తగా ఏర్పాటయ్యాయి. అదంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడు విభజన తీరుపై రాజకీయ వివాదాలు రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా విభజన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ. శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టు, అడ్డగోలుగా విభజించారంటూ మండిపడుతున్నారు కాషాయ లీడర్స్. అసలు జీహెచ్ఎంసీ విభజన వెనక చాలా పెద్ద కుట్ర ఉందన్నది బీజేపీ ఆరోపణ. కాంగ్రెస్ నాయకులు తమ మిత్రులకు రాజకీయ లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కమలం నేతలు.
హైదరాబాద్ను మజ్లిస్కు కట్టబెట్టే దిశగానే కాంగ్రెస్ సర్కార్ అలా విభజన చేసిందని అంటున్నారు. పాతబస్తీతో పాటు ముస్లిం ప్రాబల్యం ఉన్న ఏరియాలను గ్రేటర్ పరిధిలో ఉంచారని, దాన్ని బట్టి చూస్తేనే… వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో అర్థమవుతోందని అంటున్నారు. అదే సమయంలో మూడు కార్పొరేషన్స్లో బీజేపీ పరిస్థితిపై కూడా చర్చ జరుగుతోంది. మూడు చోట్ల పార్టీకి పట్టుందని, జీహెచ్ఎంసీలో అయితే… బీజేపీ వర్సెస్ మజ్లిస్ అన్నట్టుగా పోరు జరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు. అటు సైబరాబాద్, మల్కాజ్ గిరిల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పొలిటికల్ ఫైట్ ఉంటుందన్నది కమలం కేలిక్యులేషన్.
Also Read
కొత్త కార్పొరేషన్స్ రెండూ ఆ పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఈటల రాజేందర్ పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఈ రెండు ఎంపీ సీట్లలో బీజేపీరి భారీ మెజారిటీ వచ్చింది. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో కూడా మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధి లో ఎక్కువ డివిజన్స్ను గెలుచుకుంది బీజేపీ. అయితే…గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రాంతాలు, కార్పొరేషన్ కూర్పు మాత్రం కాషాయ దళానికి మింగుడు పడ్డం లేదట. కోర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎంఐఎం దక్కించుకునేలా ఈ విభజన ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు.
- Tags
- GHMC
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!