CPI Narayana: ఆ ఐదు గ్రామాలను తెలంగాణాకు ఇవ్వాలి!
- డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణం
- ఆ ఐదు గ్రామాలను తెలంగాణాకు ఇవ్వాలి
- కాకినాడ దుర్ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా వారిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్దం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇరాన్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే ప్రయత్నంగా యుద్దం చేస్తుందన్నారు. దురాక్రమణ చేసేందుకే పలు కారణాలు చూపి యుద్దం ప్రారంభించిందని అమెరికాపై మండిపడ్డారు. ప్రధాని మోడీ చొరవ తీసుకుని ప్రపంచ దేశాల సమన్వయంతో ట్రంప్తో మాట్లాడి యుద్దం ఆపేలా ప్రయత్నం చేయాలని కోరారు.
భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణాకు ఇవ్వాలని సీపీఐ తరపున కోరుతున్నామని నారాయణ తెలిపారు. ధార్మిక సంస్థల్లో కఠినమైన పాలసీలు తీసుకురావటం ద్వారానే లడ్డూ కల్తీ లాంటి సమస్యలు ఆగుతాయని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని, శ్రీలక్ష్మి చేసిన చిన్న తప్పిదం వలన ఆమె కెరీర్ దెబ్బతిందన్నారు. బాద్యతాయుతంగా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రలోభాలకు లొంగడంతోనే వ్యవస్తలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Also Read: Tomato Price Drop: 2 రూపాయలకు పడిపోయిన టమోటా ధర.. లబోదిబోమంటున్న రైతన్నలు!
కాకినాడ లో జరిగిన దుర్ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని నారాయణ పేర్కొన్నారు. కల్తీ పాలు తాగటం వలన ప్రజలు చనిపోతున్నారని, డెయిరీలపై ప్రభుత్వ నియంత్రణ ఏమైందని ప్రశ్నించారు. నక్సలైట్లను చంపవచ్చు కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరన్నారు. పేదరిక నిర్మూలన జరిగితే నక్సలిజం అవసరమే రాదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను అణగదొక్కాలని అవినీతి మరక అంటించారని ఆరోపించారు. ప్రధాని మోడీ, అమిత్ షా కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆరు వేల కోట్లు ఉన్నాయని.. రెండు వేల కోట్లు విడుదల చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ కేసును సీఎం చంద్రబాబు మధ్యవర్తిత్వానికి అప్పగించాలని నారాయణ కోరారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!