Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారతదేశానికి ధీటుగా మా ఆర్మీ ఉంది, ఎప్పుడైనా కాశ్మీర్ ను రక్షించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశ సైన్యానికి తిండి పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. చివరకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. FOL(ఫ్యూయర్, ఆయిల్, లూబ్రికెంట్ల) కొరత పాక్ ఆర్మీని తీవ్రంగా వేధిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
దీంతో పాక్ ఆర్మీ రెగ్యులర్ గా జరిగే ‘యుద్ధ అభ్యసాలను’ నిలిపివేసింది. ఇప్పటికే పాక్ సైన్యం అన్ని ఫీల్డ్ ఫార్మెషన్లకు, ప్రధాన కార్యాలయాలకు లేఖలు రాసింది. డిసెంబర్ నెల వరకు అన్ని వార్ గేమ్స్ ని నిలపివేయాలని ఆదేశించింది. దీనికి కారణం ఇంధనం, లూబ్రికెంట్ల కొరతే. సాధారణంగా యుద్ధ అభ్యాసాల సమయంలో శతఘ్నులు, యుద్ధ విమానాలు, ఇతర ఆర్మీ వాహనాలను, పరికరాలను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా యుద్ధ అభ్యాసాలకు వాడే టీ-80 యుద్ధ ట్యాంక్ కిలోమీటర్ కి 2 లీటర్ల ఇంధనం అవసరం. అయితే వీటికి చాలా మొత్తంలో ఇంధనం, లూబ్రికెంట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో తినడానికి తిండే దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా చేతులెత్తేసింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని యుద్ధ అభ్యాసాలను ఆపేసింది.
Also Read
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్కు ఇరాన్ అధ్యక్షుడు..
Read Also: Tamilnadu: తమిళనాడులో మరో పథకం.. గృహిణులకు ప్రతినెలా రూ.1000
ఇప్పటికే పాక్ ఆర్మీలోని జవాన్లకు రేషన్ పై ఫుడ్ పెడుతోంది అక్కడి ప్రభుత్వం. గోధుమల కొరతతో మంచి ఆహారం పాక్ సైనికులకు కరువైంది. చివరకు తినడానికి క్యాంటీన్లకు వెళ్లాలన్నా కూడా ఇంధనం ఆదా చేయడానికి వాహనాల్లో వెళ్లడం లేదు. నడుచుకుంటూ క్యాంటీన్లకు వెళ్తున్నారు. భారత్-పాక్ సరిహద్దు ఎల్ఓసీ వద్ద సైనికులు కూడా ఇందుకు మినహాయించు కాదు. వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థికంగా దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ దేశానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదు. చివరకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తుంది. పాక్ అప్పులు రుణం 77.5 బిలియన్ల డాలర్లు ఉంది. ఇక ప్రస్తుతం పాక్ ఖజానాలో కేవలం 4-5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అప్పులు దేశ జీడీపీలో 22 శాతం ఉన్నాయి. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.253, కిరోసిన్ రూ. 164కి చేరుకుంది. గోధుమలు, కూరగాయాలు ప్రజలకు అందుబాటులో లేవు. ఇక ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్భణం 38 శాతంగా ఉంది. ద్రవ్యోల్భణంలో శ్రీలంకను పాకిస్తాన్ అధిగమించింది.
తాజావార్తలు
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
-
Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
-
Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
-
Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
-
RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!