Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారతదేశానికి ధీటుగా మా ఆర్మీ ఉంది, ఎప్పుడైనా కాశ్మీర్ ను రక్షించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశ సైన్యానికి తిండి పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. చివరకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. FOL(ఫ్యూయర్, ఆయిల్, లూబ్రికెంట్ల) కొరత పాక్ ఆర్మీని తీవ్రంగా వేధిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
దీంతో పాక్ ఆర్మీ రెగ్యులర్ గా జరిగే ‘యుద్ధ అభ్యసాలను’ నిలిపివేసింది. ఇప్పటికే పాక్ సైన్యం అన్ని ఫీల్డ్ ఫార్మెషన్లకు, ప్రధాన కార్యాలయాలకు లేఖలు రాసింది. డిసెంబర్ నెల వరకు అన్ని వార్ గేమ్స్ ని నిలపివేయాలని ఆదేశించింది. దీనికి కారణం ఇంధనం, లూబ్రికెంట్ల కొరతే. సాధారణంగా యుద్ధ అభ్యాసాల సమయంలో శతఘ్నులు, యుద్ధ విమానాలు, ఇతర ఆర్మీ వాహనాలను, పరికరాలను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా యుద్ధ అభ్యాసాలకు వాడే టీ-80 యుద్ధ ట్యాంక్ కిలోమీటర్ కి 2 లీటర్ల ఇంధనం అవసరం. అయితే వీటికి చాలా మొత్తంలో ఇంధనం, లూబ్రికెంట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో తినడానికి తిండే దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా చేతులెత్తేసింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని యుద్ధ అభ్యాసాలను ఆపేసింది.
Also Read
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
- S8000 Banderol: చైనా ఇంజిన్.. అమెరికా టెక్నాలజీ.. రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్
Read Also: Tamilnadu: తమిళనాడులో మరో పథకం.. గృహిణులకు ప్రతినెలా రూ.1000
ఇప్పటికే పాక్ ఆర్మీలోని జవాన్లకు రేషన్ పై ఫుడ్ పెడుతోంది అక్కడి ప్రభుత్వం. గోధుమల కొరతతో మంచి ఆహారం పాక్ సైనికులకు కరువైంది. చివరకు తినడానికి క్యాంటీన్లకు వెళ్లాలన్నా కూడా ఇంధనం ఆదా చేయడానికి వాహనాల్లో వెళ్లడం లేదు. నడుచుకుంటూ క్యాంటీన్లకు వెళ్తున్నారు. భారత్-పాక్ సరిహద్దు ఎల్ఓసీ వద్ద సైనికులు కూడా ఇందుకు మినహాయించు కాదు. వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థికంగా దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ దేశానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదు. చివరకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తుంది. పాక్ అప్పులు రుణం 77.5 బిలియన్ల డాలర్లు ఉంది. ఇక ప్రస్తుతం పాక్ ఖజానాలో కేవలం 4-5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అప్పులు దేశ జీడీపీలో 22 శాతం ఉన్నాయి. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.253, కిరోసిన్ రూ. 164కి చేరుకుంది. గోధుమలు, కూరగాయాలు ప్రజలకు అందుబాటులో లేవు. ఇక ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్భణం 38 శాతంగా ఉంది. ద్రవ్యోల్భణంలో శ్రీలంకను పాకిస్తాన్ అధిగమించింది.
తాజావార్తలు
-
AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
-
వన్డే ప్రపంచకప్ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
BOI Credit Officer Recruitment 2026: 779 పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం.. అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
-
Minister Satyakumar: అమరావతిపై జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
ట్రెండింగ్
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!