Srilanka Economic Crisis: దేశంలో స్కూళ్లు బంద్.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. రోజుల తరబడి ఎదురుచూసిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు.
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ భోదన చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Read Also: BJP National Executive Meeting: విజయవంతంగా బీజేపీ సభ.. బండి భుజం తట్టిన మోడీ
అప్పర్ మిడిల్ ఆదాయ దేశంగా ఉన్న శ్రీలంక స్వాతంత్య్రం పొందిన 1948 నుంచి ఇలాంటి సంక్షోభాన్ని ఏనాడు చూడలేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అప్పులు వెరిసి శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీంతో ఈ పరిణామాలకు కారణం అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని మహిందా రాజపక్సేలే కారణం అని శ్రీలంక ప్రజలు వీరిద్దరు రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. కొత్తగా రణిల్ విక్రమసింఘే ప్రధాని పదవిని చేపట్టారు. మే నెలలో ఆహార ద్రవ్యోల్భనం 57.4 శాతంగా ఉంది. మార్చి 2022 నుంచి శ్రీలంక కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!