Srilanka Economic Crisis: దేశంలో స్కూళ్లు బంద్.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. రోజుల తరబడి ఎదురుచూసిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు.
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ భోదన చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.
Also Read
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
Read Also: BJP National Executive Meeting: విజయవంతంగా బీజేపీ సభ.. బండి భుజం తట్టిన మోడీ
అప్పర్ మిడిల్ ఆదాయ దేశంగా ఉన్న శ్రీలంక స్వాతంత్య్రం పొందిన 1948 నుంచి ఇలాంటి సంక్షోభాన్ని ఏనాడు చూడలేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అప్పులు వెరిసి శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీంతో ఈ పరిణామాలకు కారణం అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని మహిందా రాజపక్సేలే కారణం అని శ్రీలంక ప్రజలు వీరిద్దరు రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. కొత్తగా రణిల్ విక్రమసింఘే ప్రధాని పదవిని చేపట్టారు. మే నెలలో ఆహార ద్రవ్యోల్భనం 57.4 శాతంగా ఉంది. మార్చి 2022 నుంచి శ్రీలంక కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?