Srilanka Economic Crisis: ఉద్రిక్త పరిస్థితులు.. అత్యవసర సమావేశాని ప్రధాని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన, ఆహార సంక్షోభాలతో ఇక్కట్లు పడుతున్న శ్రీలంకలో మరోసారి నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. భద్రతాబలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకువచ్చారు నిరసనకారులు. దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సను సురక్షిత ప్రాంతానికి తరలించింది శ్రీలంకన్ ఆర్మీ. ఇదిలా ఉంటే రాజపక్స పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు వెంటనే అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తొలిసారిగా చాలా మంది మిలిటరీ సంబంధిత వ్యక్తులు ఆందోళనకారులతో జతకలిశారు. వీరంతా అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ఆయన నివాసం వద్ద ఆందోళన చేశారు. ఆందోళకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడి, స్మిమ్మింగ్ పూల్ ఈత కొట్టడం, కిచెన్ లో వంట చేసుకోవడం వంటివి వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిరసనకారులు కొలంబో చేరుకోవడానకి ప్రయత్నిస్తున్నారు. కొలంబోకు రైళ్లు నడపాలని ఆందోళకారులు రైల్వేపై ఒత్తడి తీసుకువస్తున్నారు.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
Read Also: Uttarpradesh: రోడ్డు పక్కన కూర్చున్న వారిపై నుంచి దూసుకెళ్లిన వాహనం.. 6గురు మృతి
ఇదిలా ఉంటే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాడు. అధికారిక, ప్రతిపక్ష పార్టీల నేతలంతా రావాలని కోరారు. శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది. సమ్యస్య పరిష్కారానికి ప్రతిపక్ష నేతలంతా సహకరించాలని ప్రధాని విక్రమసింఘే కోరుతున్నారు.
తీవ్ర ఆహార, ఇంధన సంక్షోభంతో శ్రీలంక ఇబ్బందులు పడుతోంది. విదేశాల నుంచి వచ్చే ఇంధనానికి కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. దేశంలో విదేశీమారక నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. దీంతో శ్రీలంకలో పెట్రోల్ బంకుల మందు రోజుల తరబడి నిలుచున్నా.. లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం ఏర్పడింది. ఇది ఆందోళనకు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది. 1948లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇలాంటి సంక్షోభాన్ని శ్రీలంక ఎప్పుడు ఎదుర్కోలేదు.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!