Srilanka Economic Crisis: ఉద్రిక్త పరిస్థితులు.. అత్యవసర సమావేశాని ప్రధాని పిలుపు
శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన, ఆహార సంక్షోభాలతో ఇక్కట్లు పడుతున్న శ్రీలంకలో మరోసారి నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. భద్రతాబలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకువచ్చారు నిరసనకారులు. దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సను సురక్షిత ప్రాంతానికి తరలించింది శ్రీలంకన్ ఆర్మీ. ఇదిలా ఉంటే రాజపక్స పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు వెంటనే అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తొలిసారిగా చాలా మంది మిలిటరీ సంబంధిత వ్యక్తులు ఆందోళనకారులతో జతకలిశారు. వీరంతా అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ఆయన నివాసం వద్ద ఆందోళన చేశారు. ఆందోళకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడి, స్మిమ్మింగ్ పూల్ ఈత కొట్టడం, కిచెన్ లో వంట చేసుకోవడం వంటివి వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిరసనకారులు కొలంబో చేరుకోవడానకి ప్రయత్నిస్తున్నారు. కొలంబోకు రైళ్లు నడపాలని ఆందోళకారులు రైల్వేపై ఒత్తడి తీసుకువస్తున్నారు.
Also Read
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
Read Also: Uttarpradesh: రోడ్డు పక్కన కూర్చున్న వారిపై నుంచి దూసుకెళ్లిన వాహనం.. 6గురు మృతి
ఇదిలా ఉంటే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాడు. అధికారిక, ప్రతిపక్ష పార్టీల నేతలంతా రావాలని కోరారు. శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది. సమ్యస్య పరిష్కారానికి ప్రతిపక్ష నేతలంతా సహకరించాలని ప్రధాని విక్రమసింఘే కోరుతున్నారు.
తీవ్ర ఆహార, ఇంధన సంక్షోభంతో శ్రీలంక ఇబ్బందులు పడుతోంది. విదేశాల నుంచి వచ్చే ఇంధనానికి కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. దేశంలో విదేశీమారక నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. దీంతో శ్రీలంకలో పెట్రోల్ బంకుల మందు రోజుల తరబడి నిలుచున్నా.. లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం ఏర్పడింది. ఇది ఆందోళనకు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది. 1948లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇలాంటి సంక్షోభాన్ని శ్రీలంక ఎప్పుడు ఎదుర్కోలేదు.
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో