Srilanka Economic Crisis: ప్రధాని ఇంటికి నిప్పు.. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. వేలాదిగా నిరసనకారులు కొలంబోలో నిరసనలు, ఆందోళ కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళను చేపట్టారు. పరిస్థితులు కట్టుతప్పే ప్రమాదం ఉండటంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన అధికార నివాసాన్ని వదిలి పారిపోయారు. శ్రీలంకన్ ఆర్మీ అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష భవనంతో పాటు, ఆయన పరిపాలన భవనాన్ని ఆందోళనకారులు ఆక్రమించారు. ఆందోళనకారుల్ని అదుపు చేయడంతో ఆర్మీ, పోలీసులు కూడా చేతులెత్తేశారు.
ఇదిలా ఉంటే శనివారం ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కొద్ది గంటల క్రితం గోటబయ రాజపక్స రాజీనమా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడిన ఆందోళకారులు నిప్పంటించారని లంక ప్రధాని కార్యాలయం తెలిపింది.
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
Read Also: Etela Rajender : గజ్వేల్పై ప్రత్యేక దృష్టి పెట్టిన.. అక్కడి నుండే పోటీ చేస్తా..
ఇదిలా ఉంటే తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు రణిల్ విక్రమసింఘే. ఈ రోజు శ్రీలంకలోని అధికార, విపక్ష పార్టీలతో ఆయన తాజా పరిస్థితుల గురించి చర్చించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ద్వీపదేశంలో గత మార్చి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడితో గోటబయతో పాటు అప్పటి ప్రధాని మహిందా రాజపక్సలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆందోళనలకు తలొగ్గి మహిందా రాజపక్స తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో రణిల్ విక్రమ సింఘే మే 12న అధికారం చేపట్టారు. తాజాగా జరుగుతున్న ఆందోళనతో ఆయన కూడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డిజిల్ కోసం రోజుల తరబడి బంకుల ముందు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంధనం, ఆహారం, ఔషధాలు కొందామన్నా.. శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు లేవు. దీంతో ఏడు దశాబ్ధాల కాలంలో శ్రీలంక అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది.
#WATCH | Sri Lanka: Amid massive unrest in the country, protestors set ablaze the private residence of Sri Lankan PM Ranil Wickremesinghe#SriLankaCrisis pic.twitter.com/BDkyScWpui
— ANI (@ANI) July 9, 2022
తాజావార్తలు
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో