కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్, చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు, శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి. వనాల్లో వుండాల్సిన వన్యప్రాణులు జనాల్లోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఓ ఇంటిలో తిష్టవేసిన ఎలుగు బంటి జనాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పి.రామ్మోహనరావు (ఐఎఫ్ఎస్) ఆధ్వర్యంలో ఆపరేషన్ బల్లూక్ నిర్వహించారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకుని బోనులో బంధించారు. ఆపరేషన్ లో విశాఖ జూకి చెందిన మత్తు డాక్టర్,…
ఒక్క పులి.. అధికార యంత్రాంగాన్ని, సమీప గ్రామాల ప్రజల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో 12 రోజులుగా పెద్ద పులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులి దాడికి గేదెలు, ఆవులు, ఇతర జంతువులు గాయాల పాలవుతున్నాయి. మరికొన్ని చనిపోతూ యజమానులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా పొదురుపాక వద్ద ఆవుని చంపిన పులి.. గురువారం రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. పులి దాడి నుంచి గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి…
కాకినాడ జిల్లాలో పులి సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రత్తిపాడు (మం) పోతులూరు, కొడవలి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఎంపీ వంగా గీత స్పందించారు. పులిని బంధించే వరకు రైతులు పొలాల వైపు వెళ్లొద్దని ఎంపీ సూచించారు. 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రకటించారు. పులిబారినపడి చనిపోయిన పశువుల రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు ఎంపీ గీత. మరోవైపు ప్రత్తిపాడు వద్ద పులి…
ఏపీలో ఒకవైపు ఏనుగులు, మరోవైపు పులులు సంచారంతో జనం హడలిపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం…
రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు… దీనిపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పునరాలోచించాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి తడపందే రెవెన్యూ అధికారులను చెట్లను లెక్కించడం లేదన్నారు. అనుమతించేందుకు అటవీశాఖ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. Read Also: తాచుపాములా కాటేస్తున్నాడు.. కేసీఆర్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఢీఎఫ్ఓ వరకు…
అడవుల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గోళ్లు, చర్మం కోసం పెద్ద పులులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది. అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా..…
ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని…
ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా కడపజిల్లాలో నిన్న అర్ధరాత్రి ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు,40 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీల మధ్య ఛేజింగ్ జరిగింది. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె చెక్ పోస్టు వద్ద నుండి ఐచర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు. ఫారెస్టు అధికారుల దాడిని తప్పించుకునేందుకు ప్రొద్దుటూరు వైపు ఐచర్ వాహనంలో పరారవుతూ వాహనంలో నుండి దూకి పారిపోయారు 45 మంది తమిళనాడు కూలీలు. బొజ్జవారిపల్లె…