Lays Potato Chips: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ను క్లాస్ 1 రీకాల్గా ప్రకటించింది. డిసెంబర్ 13న ప్రకటించిన ఈ రీకాల్ కాస్త జనవరి 27న FDA అత్యధిక ప్రమాద స్థాయికి (క్లాస్ 1) పెంచబడింది. దీనికి కారణం, ఈ ఉత్పత్తిలో వెల్లడి చేయని పాల (Milk) మిశ్రమం ఉండటం. ఈ మిశ్రమం వల్ల కొంతమంది ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని…
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' ధృవీకరణను పొందింది.
Pani Puri: పానీపూరి అనేది చాలామందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే మరింత ఇష్టం. ఇది ఎంతో రుచికరమైనది. అయితే, అందరూ అనుకునే విధంగా వీటిని తింటే ఆనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే పానీపూరి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మరి పానీపూరి తినడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. Also Read:…
Rum in Cake : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామంలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు బేకరీలలో జరిగిన తనిఖీల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ ఖార్ఖాన ప్రాంతంలోని ఓ బేకరీలో, ఎక్సైజ్ అనుమతి లేకుండా ప్లమ్ కేక్ల తయారీలో ఆల్కహాల్ (రమ్) ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా, ఈ విషయం గురించి లేబుల్పై ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కేకుల తయారీలో ఉపయోగించే…
Food Safety Rides: హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో వివిధ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరుపగా, కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన తర్వాత నిబంధనలను పూర్తిగా అనుసరించడం లేదని అధికారులు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, కొన్ని రెస్టారెంట్లలో కంట్రోల్డ్…
Minister Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కాకుండా పీడీ యాక్ట్ పెట్టాలని చట్టం తెచ్చామన్నారు. వినియోగదారుడికి కొన్ని హక్కులు ఉన్నాయని.. వినియోగదారుడికి వ్యాపారులు కొన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అమ్మకందారులు కూడా బాధ్యతగా ఉండాలంటే చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కుబడిగా అవగాహన కార్యక్రమం చేయటం కాకుండా…
పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీలు పరిశీలించనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ…
హైదరాబాద్లో ఇటీవల హోటల్స్లో ఆహార పదార్థాల అపరిశుభ్రత, నిల్వ ఉంచిన మాంసం, సరైన నిబంధనలు పాటించకపోవడం, కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో పురుగులు, కీటకాలు కనిపించడం వంటి సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Panipuri: ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక సర్కార్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. క్యాబేజీ మంచూరియాలో కృత్రిమ రంగులు, రసాయనాలు వాడటాన్ని ఇప్పటికే నిషేధించింది. తాజాగా చాలా మంది ఫేవరెట్ అయిన ‘‘పానీపూరీ’’ని నిషేధించే దిశగా కర్ణాటక వెళ్తోంది.