Telangana: గురుకులాలు, హాస్టళ్లలో ఇకపై ఫుడ్ సేఫ్టీ కమిటీలు..
- పాఠశాలలు, గురుకులాల్లో ఆహారభద్రతపై ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు
- విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనున్న ఫుడ్ సేఫ్టీ కమిటీలు
- ఫుడ్ సేఫ్టీ కమిటీల్లో హెడ్ మాస్టర్తో పాటు మరో ఇద్దరు
- వంటకు ముందు స్టోర్ రూం, కిచెన్ను పరిశీలించాలని ఆదేశాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీలు పరిశీలించనున్నాయి. విద్యా సంస్థల్లో స్కూల్ హెడ్ మాస్టర్, గురుకుల్లాలో వార్డెన్తో పాటు మరో ఇద్దరు ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రతిరోజూ వంట చేయడానికి ముందు స్టోర్ రూం, కిచెన్ను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించాలని పేర్కొంది. ఆ తర్వాతే పిల్లలకు ఆహారం పెట్టాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే.. ఆహార పదార్థాల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపించాలని ప్రభుత్వం నియమ నిబంధలను పెట్టింది.
Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..
Also Read
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి వివిధ విద్యా సంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇటీవలే ఓ విద్యార్థి కూడా మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఆహార పదార్థాలకు సంబంధించి.. నాణ్యమైన, పౌష్టికమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపింది. 2011 నుంచి ఈ కమిటీలు ఉన్నాయి.. మరోవైపు విద్యాశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు సందర్శించి.. అక్కడ మధ్యాహ్నం భోజనం వడ్డించే తీరు, మిగతా అంశాలను పరిశీలించారు. అనంతరం.. నివేదికలను ప్రభుత్వానికి పంపించనున్నారు.
Read Also: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ పదవి కాలం పొడగించిన పార్లమెంట్..
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!